మనిషి – ప్రధాన సృష్టి

Print Friendly, PDF & Email
మనిషి – ప్రధాన సృష్టి

పంచ భూతముల యొక్క ఉత్పత్తి మరియు దివ్య ప్రేమ శక్తితో ఈ సృష్టి నుండి మానవుడు ఉద్భవించాడు. సృష్టిలో మనిషి అత్యున్నతుడు, ఎందుకంటే తన గురించి మరియు సృష్టి గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యం అతనికి మాత్రమే ఉంది. సృష్టి నుండి, మనిషి దైవం వైపు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. లక్షలాది జన్మలు, కోట్లాది సంవత్సరాల ఉత్థాన పోరాటం మనిషిని ప్రస్తుత స్థితికి చేర్చాయి.

‘సృష్టి నుండి లెక్కలేనన్ని జీవులు ఈ గ్రహం మీద నివసించాయి. కానీ మనిషి జంతు రాజ్యానికి కిరీటం, అతను జీవుల శిఖరం. మానవుడు మాత్రమే తన స్వస్వరూపాన్ని పరిశోధించగలడు మరియు దైవత్వాన్ని బహిర్గతం చేయగలడు, ఇది అతని వాస్తవికత. అందుకే మనిషిగా పుట్టడం అరుదైన బహుమతిగా భావిస్తారు.’

– శ్రీ సత్యసాయి

మనిషి స్వతహాగా పరమాత్మ స్వరూపం, ఆనందమే అతని స్వభావం: మానవ శరీరంలోని ప్రతి కణంలోనూ దైవత్వం అంతర్లీనంగా ఉంటుంది. దుఃఖం మరియు బాధ అతనికి పరాయివి. మనిషికి నైపుణ్యాలు ఉన్నాయి, వాని సాధన ద్వారా అతను దివ్యానందాన్ని అనుభవించగలడు మరియు ప్రేమ యొక్క సహజమైన శక్తిని ప్రసరింపజేయగలడు.

ప్రకృతిలోని పంచభూతాలతో మనిషికి బలమైన సంబంధం ఉందని బాబా మనకు తెలియజెప్పారు. మనిషికి మరియు ప్రకృతికి మధ్య ఉన్న ఈ సంబంధం సమగ్రమైనది, ఎందుకంటే మనిషి కూడా పంచభూతాలతో ఏర్పడిన దివ్య శక్తి యొక్క అభివ్యక్తి. ఈ పంచ భూతాలు మన లోపల మరియు వెలుపల ఉన్నాయి; అన్నిసమయాలలో, మనము ఈ అంశాలను లోపల మరియు వెలుపల మార్పిడి చేస్తున్నాము. ఉదాహరణకు, మనం ఆహారం తిన్నప్పుడు, కొంత భాగం మనలో కలిసిపోతుంది మరియు మరొక భాగం ప్రకృతికి తిరిగి వెళుతుంది. మనము గాలిని పీల్చుకుంటాము, దానిలో కొంత భాగం లోపల ఉండి పోతుంది మరియు మిగిలిన వాటిని మరికొన్ని మూలకాలతో వదులుతాము. ఇలా అన్ని వేళలా ప్రకృతితో వినిమయం జరుగుతూనే ఉంటుంది. భౌతిక అంశాల విషయానికొస్తే, ‘ధూళి నుండి నువ్వు వస్తావు, ధూళికి తిరిగి వెళ్తావు’.

మానవ జీవి అనేది విభిన్న పరిస్థితులలో సమతుల్యతను కాపాడుకునే సహజమైన సామర్థ్యంతో పనిచేసే పూర్తి సమీకృత విభాగం. మానవ శరీరం మూలకాల మధ్య సమతుల్యతను కాపాడుకునే సహజ ధోరణితో స్వీయ- స్వస్థత వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది అదనపు మూలకాలను తొలగిస్తుంది మరియు ఆహారం, గాలి, సూర్యకాంతి మొదలైన వాటి ద్వారా అవసరమైన వాటిని తీసుకుంటుంది. ఏదైనా అదనపు కాంతి, తీవ్రత, ఏదైనా పెద్ద శబ్దం, మనిషిని చికాకుపెడుతుంది.

‘సృష్టిలో ఐదు అంశాలు ఉంటాయి. అయితే, మనిషిలో ఆరవ అంశం ఉంది. అది పరమ ప్రేమ.

– శ్రీ సత్యసాయి (20 మే 2000)

‘ప్రేమతో జీవితం మొదలవుతుంది. జీవితం నుండి వచ్చే ప్రేమ యొక్క మాధుర్యమే ప్రతిదానికీ మూలమైన గొప్ప మరియు ప్రత్యేకమైన సూత్రం.

– శ్రీ సత్యసాయి (జనవరి 13, 1992)

మనిషి మరియు పంచభూతాల మధ్య సహజీవన సంబంధాన్ని బహిర్గతం చేయడంలో, భగవాన్ బాబా ప్రకృతిలోని అన్ని వస్తువులను – సజీవంగా మరియు నిర్జీవంగా పవిత్రత స్థాయికి పెంచారు. మనిషి ఈ సమగ్ర సంబంధాన్ని అర్థం చేసుకోవడం విశేషం, తన అదృష్టం.

  • ప్రకృతిలో మనిషి ప్రధాన సృష్టి.
  • జ్ఞానమంతా మనిషి మనస్సులో ఉంచబడుతుంది.
  • ప్రకృతి మరియు మనిషి మధ్య సంబంధం సమగ్రమైనది.
  • అవే పంచ భూతాలు మనిషి లోపల మరియు వెలుపల ఉన్నాయి.
  • మనిషిలోని పంచ భూతాల సమతుల్యత అతనికి శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *