శాంతి
“మానవుని చిత్తచాంచల్యము, భావోద్రేకము వీటిని ప్రశాంతతవైపు మళ్ళించడమే శాంతి. దీనికి మూలవై ఖరిలోనే మార్పు అవసరము” అన్నారు బాబా. ప్రశాంతంగా వున్న మానస సరోవరంలో అల్ల కల్లోలం సృష్టించేది కోరికలనే ఆలలే. కోరికలను దూరం చేసుకున్నపుడు మనస్సు ప్రశాంత స్థితికి తిరిగి వస్తుంది. చిత్తచాంచల్యాన్ని ఆరికట్టినపుడే మనస్సుకు ఎడతెగని శాంతి లభిస్తుంది. స్థిరమైన మనస్సుకే సత్యము గోచరిస్తుంది. సత్యము గోచరించినపుడే మనస్సు సంపూర్ణ శాంతిని అనుభవించగలదు. ఈ ఉత్తమ స్థాయిని అందుకున్న మనస్సుకే ఆనందము లభిస్తుంది.
క్షమ, ఓరిమి, సుఖ, దుఃఖాల ఎడ సమభావము, ఆత్మశక్తియందు, భగవంతుని అనుగ్రహముయందు అచంచల విశ్వాసము, లౌకిక విషయాల యందు క్రమక్రమేణా విరక్తి, భగవంతునియందు అనురక్త భగవత్స్వరూప ధ్యానము, ఇవన్నీ శాంతికి స్థిరమైన సోపానాలు.