గదాధర్ కోల్కతాకు వచ్చిన సందర్భం
పదహారేళ్ల వయస్సులో గదాధర్ కోల్కతాకు వచ్చి, పూజారి బాధ్యతలు చేపట్టాడు. ఆయన సరళత, నిజాయితీ మరియు ఆకర్షణీయమైన స్వభావం వల్ల, గౌరవనీయ కుటుంబాల నుండి స్నేహితులు మరియు అభిమానులను సంపాదించాడు. అయితే, గదాధర్ విద్యపై ఆసక్తి చూపించలేదు. ఇది రామ్కుమార్ ను అసహనానికి గురిచేసింది. ఆయన గదాధర్ను మందలించాడు. దానికి గదాధర్ స్పందిస్తూ, “హృదయాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం నాకు ఇష్టం, ఉపాధి కోసం చదివే విద్య కాదు” అన్నాడు. రామ్కుమార్ ఈ దృక్పథాన్ని అర్థం చేసుకోవడంలో కష్టపడ్డాడు, కానీ చివరికి గదాధర్ సాధారణ జీవితానికి అతీతమైన లక్ష్యానికి పుట్టినవాడని గ్రహించాడు. విద్యను కొనసాగించమని ప్రోత్సహించినా, చివరికి రఘువీర్ సంకల్పానికి విషయాన్ని అప్పగించాడు. ఇది గదాధర్ జీవితంలో విస్తృత ప్రభావం కలిగించే అనూహ్య సంఘటనకు దారితీసింది.
దక్షిణేశ్వర్లోని కాళీ దేవాలయం
దక్షిణేశ్వర్లోని కాళీ దేవాలయం దక్షిణేశ్వర్లోని కాళీ దేవాలయాన్ని ధనిక వితంతువైన రాణి రాస్మణి 1847లో గంగా నది తూర్పు తీరంలో నిర్మించారు.
ఈ దేవాలయం ఈ క్రింద సముదాయంతో నిర్మించబడినది:
- విశాలమైన కాళీ దేవి ఆలయం
- శ్రీ రాధా-కాంత దేవాలయం
- గంగా నది పైన ద్వాదశ శివాలయాలు
- విశాలమైన సంగీత మందిరం
- దేవాలయ సిబ్బందికి గదులు మరియు రాణి కుటుంబానికి నివాస గృహాలు
- రెండు చెరువులతో కూడిన తోట
- శ్రీ రామకృష్ణుని జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యత పొందిన పెద్ద మర్రిచెట్టు
కాళీ విగ్రహ ప్రతిష్ఠ
1855 మే 31న కాళీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాణి రాస్మణి తక్కువ కులానికి చెందినవారు కావడం వల్ల సంప్రదాయ బ్రాహ్మణులను పూజారిగా నియమించడం లేదా ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఒప్పించడంలో కష్టాలు ఎదురయ్యాయి. ఆ కాలంలో, తక్కువ కులాలవారి కోసం బ్రాహ్మణులు పూజ చేయడం లేదా వారి నుండి బహుమతులు స్వీకరించడం అనుచితంగా భావించబడేది. రాణి అనేక ప్రసిద్ధ పండితులను సంప్రదించినా, ఝామాపుకూర్ ప్రాంతానికి చెందిన ఒకరు తప్ప, ఎవరూ అంగీకారయోగ్యులుగా పరిగణించబడలేదు. అప్పుడు రామ్కుమార్ ఒక పరిష్కారాన్ని సూచించాడు. రాణి దేవాలయాన్ని ఒక బ్రాహ్మణునికి దానం చేసి, నిర్వహణకు తగిన నిధులు అందిస్తే, సంప్రదాయానికి విరుద్ధంగా లేకుండా బ్రాహ్మణులు పాల్గొనవచ్చు. రాణి ఈ సలహాను స్వీకరించి, రామ్కుమార్ ను స్వయంగా పూజారిగా నియమించింది. ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇది రాణికి ఆనందం మరియు ఉపశమనం కలిగించింది.
శ్రీ రామకృష్ణులు దక్షిణేశ్వర్కు వచ్చిన సందర్భం
గదాధర్ (తరువాత శ్రీ రామకృష్ణులుగా ప్రసిద్ధిగాంచారు) దక్షిణేశ్వర్కు వచ్చి, తన అన్నతో కలిసి ఆలయ తోటలో నివసించడం ప్రారంభించాడు. అక్కడి ప్రశాంతమైన మరియు అనుకూల వాతావరణం, ఆయన ఆధ్యాత్మిక సాధనకు పూర్తి సహకారాన్ని కల్పించింది. గదాధర్కు తన మేనల్లుడు అయిన ‘హృదయ్’ సహచరుడిగా చేరాడు. ఆయన ఇరవై అయిదు సంవత్సరాలు శ్రీ రామకృష్ణునికి నిజమైన స్నేహితుడిగా మరియు సేవకుడిగా ఉన్నాడు. హృదయ్ రావడంతో గదాధర్కు ఎంతో ఆనందం కలిగింది. ఆయనకు స్నేహితుడిగా, కష్టసమయంలో నమ్మదగిన వ్యక్తిగా, ఆశ్రయంగా ఉండేవాడు.
రాణి రాస్మణి అల్లుడు అయిన మధురనాథ్ బిస్వాస్, యువ గదాధర్ను గమనించాడు. ఆయనను ఒప్పించి, ఉదయం సమయంలో కాళీ దేవి విగ్రహాన్ని పుష్పాలు, ఆకులు, గంధంతో అలంకరించడం మరియు సాయంత్రం సమయంలో విలువైన ఆభరణాలు, వస్త్రాలతో శోభాయమానంగా చేయడం వంటి బాధ్యతలను అప్పగించాడు. ఈ విధంగా, తన స్వభావానికి అనుగుణమైన పనిలో నిమగ్నమైన గదాధర్, తన హృదయాన్ని పూర్తిగా అంకితం చేశాడు. ఖాళీ సమయాల్లో, ఆయన భక్తిగీతాలతో దేవిని ఆనందింపజేసేవాడు. ఇవి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి.
శ్రీ రామకృష్ణుని జ్ఞానం మరియు దక్షత
కాళీ దేవాలయంలో నియామకం పొందిన కొద్దికాలంలోనే, శ్రీ రామకృష్ణుని విలువను రాణి రాస్మణి మరియు మధుర్ దృష్టిలో పెంచిన ఒక సంఘటన జరిగింది. ఒక రోజు రాధా-కాంత దేవాలయ పూజారి కృష్ణ విగ్రహాన్ని విశ్రాంతి గదికి తీసుకెళ్తున్నప్పుడు జారి పోయి విగ్రహం కాలు విరిగిపోయింది. ఈ సంఘటన ఆలయంలో కలకలం రేపింది మరియు పూజారిని అతని నిర్లక్ష్యానికి పదవి నుండి తొలగించారు. రాణి సలహా కోసం పండితులను పిలిపించగా, వారు ఏకగ్రీవంగా విగ్రహాన్ని గంగలో విసిరేసి కొత్తదాన్ని ప్రతిష్ఠించాలని సూచించారు. శాస్త్రోక్త విధానాలను ఉల్లేఖిస్తూ, ఈ నిర్ణయం రాణికి నచ్చలేదు. మధుర్ సూచన మేరకు ఆమె శ్రీ రామకృష్ణుని అభిప్రాయం కోరింది. కథను విన్న అనంతరం, శ్రీ రామకృష్ణులు ఉత్సాహభరితంగా ఇలా అన్నారు:
“వారి పరిష్కారం అర్థహీనమైనది. రాణి అల్లుడు కాలు విరిగితే, ఆమె అతన్ని వదిలేసి ఇంకొకరిని తీసుకురావాలనుకుంటుందా? బదులుగా అతని చికిత్సను ఏర్పాటు చేయదా? ఇదే విధంగా ఈ విగ్రహాన్ని మరమ్మతు చేసి మునుపటిలాగే పూజించాలి.”
శ్రీ రామకృష్ణుని కళా నైపుణ్యం మరియు అభినందన
శ్రీ రామకృష్ణుని తీర్పుతో పండితులు తొలుత అయోమయంలో పడ్డారు. మొదట సంతృప్తిగా ఉండనప్పటికీ, చివరికి వారు ఆ అభిప్రాయాన్ని అంగీకరించక తప్పలేదు. రాణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మట్టి దేవతా రూపాలు తయారుచేయడంలో నిపుణులైన శ్రీ రామకృష్ణులు, రాణి అభ్యర్థన మేరకు విగ్రహ మరమ్మత్తుకు సిద్ధమయ్యారు. అతను విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఎవరు గుర్తు పట్టలేని విధంగా తయారు చేసారు. ఈ చర్య ఫలితంగా, శ్రీ రామకృష్ణులను రాధా-కాంత దేవాలయ పూజారిగా నియమించారు. హృదయ్కి రామ్కుమార్ కు సహాయం చేయడం కోసం కాళీ విగ్రహాన్ని అలంకరించడంలో బాధ్యత అప్పగించారు.