శ్వాస నిర్వహణ

Print Friendly, PDF & Email
శ్వాస నిర్వహణ

శ్వాస నిర్వహణ పై పాశ్చాత్య తత్వశాస్త్రం మరియు తూర్పు తత్వశాస్త్రాల మధ్య వ్యత్యాసం వివరించబడింది. పాశ్చాత్య తత్వశాస్త్రం ప్రకారం ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే “నేను భావిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను” అని. తూర్పు తత్వశాస్త్రం “నేను ఉన్నాను కాబట్టి, నేను భావిస్తున్నాను” అని చెప్తుంది. నేను శ్వాసలో ఉన్నాను. నేను తప్ప ఆలోచించడానికి ఎవరు న్నారు. ఏ కోహం. శ్వాస అన్నది బ్రహ్మ స్వరూపము. శ్వాస అన్నది మనలో ప్రసరిస్తున్న ప్రాణశక్తి. శ్వాస ప్రక్రియ అనగా గాలిని పీలుచుకోవడం, బంధించటం మరియు వదిలిపెట్టడం. ఊపిరి పీల్చుకోకపోతే మనిషి చనిపోతాడని శాస్త్రం చెప్తుంది. కనుక ఊపిరిని నియంత్రించండి. మన జీవితకాలమంతా లయబద్ధమైన శ్వాస మరింత శాంతిగా ఉంటుంది.

నేను అబద్ధం చెప్పినప్పుడు, నేను అబద్ధం చెప్పానని మీకు తెలియకపోవచ్చు. కానీ వెంటనే నా శ్వాస నాకు “నాకు ఇష్టమైన వారితో నీవు అబద్దం చెప్పావు”అని హెచ్చరిస్తుంది. మనస్సాక్షి మెదడుకు చెబుతుంది. నేను ఎవరిని హాని చేస్తున్నాను. మీకు ఎవరికో కాదు నాకు నేనే హాని చేసుకుంటున్నాను, చంపుకుంటున్నాను. నేను లయబద్ధమైన నా శ్వాసను విచ్చిన్నం చేశాను. శ్వాస అన్నది ఒక నిరంతరంగా, నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. ఇది లయబద్ధంగా ఉంటే మనం ఇష్టపడేదిగా మరియు పూర్తిగా ఆనందాన్నిచ్చే ప్రక్రియ. అది లయబద్ధంగా లేకపోతే దానిని కాకో ఫోన్ అంటారు. శబ్దం అన్నది సింఫనీ కాదు, సంగీతము కాదు.

ఇటువంటి సంగీతాన్ని 24 గంటలు వింటే మనిషికి పిచ్చెక్కిపోతుంది. ఏడు రోజులకు మనిషిని చంపేస్తుందని అంటారు. లీటరియన్ రోజుల్లో ఒక వ్యక్తిని శిక్షించాలి అంటే, లయబద్ధతలేని కాకో ఫోనీ సంగీతాన్ని వినిపించటం చేసేవారు. కనుక శాంతిని కలిగి ఉండాలంటే శ్వాసను లయబద్ధంగా నియంత్రించాలి. లయ శాంతికి చిహ్నము. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ లయ ఉంటుంది మరియు ఎక్కడ లయ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. అందువలన ఈ శ్వాసను లయ బద్ధంగా నిర్వహించడానికి మనం ఒక ప్రమాణాన్ని కలిగి ఉండాలి.

ఈ లయను పొందడానికి బాబా సూచించినటువంటి రెండు ప్రాథమిక సూచనలు

1.నామస్మరణ: (భగవంతుని మహిమను కీర్తించటం). భగవన్నామాన్ని పాడినప్పుడు మన నుండి లయబద్ధమైన ధ్వని ప్రకంపాలను పంపగలుగుతాము. ధ్వని ప్రకంపనాల ద్వారా వచ్చిన అదే గాలిని పీల్చుకుంటాము.మన కదలికల ద్వారా లయబద్ధంగా వచ్చిన గాలిని పీల్చడం ద్వారా శక్తి పుంజుకుంటుంది. ఆ ప్రభావం ద్వారా మనము శక్తివంతమైన వాతావరణంలో కూర్చుంటాము. అందుకే బాబా చెప్తారు “భజన తర్వాత మీరు ప్రశాంతతను నిలుపుకోవాలి. తద్వారా మీరు లయప్రకంపనాలను మీలో నిలుపుకోవచ్చు. దీని ద్వారా మీరు స్వాంతన పొందుతారు. అందుకే అందరికీ నామస్మరణ నిర్దేశించబడినది. ఇది ప్రతి సాయి భక్తునికి ఒక ఇంజక్షన్ వంటిది. నేను సభ్యులకు ఈ లయబద్ధమైన నామస్మరణను సూచిస్తాను. ఎందుకంటే పాడకుండా ఉండడం కంటే కొంత పాడడం మంచిది. లయబద్ధంగా సినిమా సంగీతం కూడా.

2. రెండవది నామస్మరణకు సంబంధించిన సంగీతం: రద్దీగా ఉండే ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అన్ని బహిరంగ ప్రదేశాల్లో సంగీతాన్ని వింటున్నప్పుడు, బయట శబ్దాలు తక్కువగా వినపడతాయి. సంగీతాన్ని వినకుండా ఉంటే బయటి శబ్దాలన్ని చాలా ఎక్కువగా వినబడుతాయి . అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. అక్కడ గాలిలో మరియు వాతావరణంలో సంగీతం ఉన్నప్పటికీ మీ మనసు దానిని ఆస్వాదించదు. ఒకసారి దానిని విన్నప్పుడు దానికి అనుగుణంగా మీ శ్వాస ఉత్తమమైనదిగా, లయబద్ధంగా మారుతుంది. కనీసం బాలవికాస్ లో అయినా ఇది దినచర్యగా మారాలి. కనీసం వారానికి ఒకసారైనా మీ కుటుంబంలో, మీ భార్య, పిల్లలు, భర్తతో కూర్చుని భగవంతుని మహిమను కీర్తించండి. ప్రశాంతతను,లయను ఆస్వాదించండి. దయచేసి ఏమి జరుగుతుందో గమనించండి. స్వామి వారి ప్రవర్తనా నియమావళి లోని నిత్య నామస్మరణను మేము ఇక్కడ వివరిస్తున్నాము.

3.మూడవ బోధన ప్రార్థన: మీరు ప్రార్థనను తప్పకుండా చేయాలి. ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రార్థన అనేది మనలోని అనేక ఆలోచనలను భగవంతునితో చెప్పడానికి ఒక మాధ్యమం. మనలో ఉండే ఆలోచనలను మనం బయటికి తీసుకురాలేము.మన గురించి మనం భయపడతాము. పర్యావరణానికి భయపడతాము. దైవం మనం చెప్పేదంతా వింటాడు.అయితే చాలా మంది ప్రార్థన చేయడం మర్చిపోతానని తరచుగా చెబుతుంటారు. బాబా ఒక ఉదాహరణ చెప్తారు.ప్రార్థన అనేది ఒక ఔషధం లాంటిది.మీరు వైద్యుడి దగ్గరకు వెళ్ళినప్పుడు అతను కొన్ని మాత్రలను సూచిస్తాడు. అతను 3 a.m మరియు 9 a.m. మరియు 3 p.m. అని చెప్పడు కదా. అతను భోజనం తర్వాత కానీ నిద్రించే ముందు కానీ తీసుకోమని చెప్తారు.ఇది రోజువారీ దినచర్య కనుక కనీసం క్రమం తప్పకుండా ఔషధాన్ని గుర్తుంచుకుంటారు. ప్రార్థన అనేది మన నిత్య దినచర్యనే. అందుకే బాలవికాస్ లో పిల్లలకు నిత్యం ప్రార్థనలు నేర్పిస్తారు. మీరు స్నానం చేయునపుడు ప్రార్థించండి. మనం శరీరం పై పోయబడిన నీరు బాహ్య శరీరాన్ని శుద్ధి చేస్తుంది. స్నానం చేయనప్పుడు గాయత్రి మంత్రాన్ని జపిస్తే అది శరీరంలో అంతర్గతంగా ఉన్న భాగాలను శుద్ధి చేస్తుంది. మీరు భోజనం చేయడానికి ముందు దేవునికి ధన్యవాదాలు చెప్పండి. ప్రార్థన అనేది కృతజ్ఞత మాత్రమే కాదు. పాత్రలో వంట చేసే ప్రక్రియలో మనం సేకరించిన వస్తువులను, ఆహార పదార్థాలను ప్రార్థన శుద్ధిగావిస్తుందని బాబా చెప్పారు. ప్రార్థన ఒక జీవన విధానం. కనుక ప్రార్థన చేయాలి. కనీసం ఈ సమయాల్లోనైనా ప్రార్థించాలి. శుద్ధి చేసే సమయంలో మరియు భోజనానికి కూర్చున్న సమయంలో గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

ఒకసారి మనం ప్రార్థన చేస్తే, మఝ శ్వాసక్రియ లయబద్ధంగా మారుతుంది. తద్వారా మనకు మరింత శాంతి కలుగుతుంది. అప్పుడు అది శాంతి నుండి ప్రశాంతికి దారితీస్తుంది. అదే బ్యూటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్రీత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *