జొరాష్ట్రియన్ మతం
జొరాష్ట్రియన్ మతం
8500 సంవత్సరాల క్రితం నివసించిన జొరాతుష్ట్ర స్థాపించిన మతం, ఆయననే జొరాస్టర్ అని కూడా పిలుస్తారు అతను ఒక పర్షియన్ ప్రవక్త క్రీస్తుపూర్వం 6400 సంవత్సరంలో జన్మించాడు వారి తల్లి పేరు ఎర్త్/ జెసుర్రా. ఆమె తనను దుష్ట శక్తుల నుంచి రక్షించుకోవడానికి చేసిన ప్రార్థనల ఫలితంగా కుమారుడు జన్మించాడని భావించింది.జొరాతుష్ట తన 20 వ సంవత్సరంలో ఒంటరితనాన్ని కోరుకున్నాడు.పది సంవత్సరాలు ఒంటరిగానే ధ్యానం లో నిమగ్నమయ్యాడు.తర్వాత వారి దేవుడైన అహురమజ్జ తో, అనుసంధానం అయ్యాడు. దీనితోనే అతనికి గాధలు, బోధ పడ్డాయి.ఎలాగైతే ఆర్యులను వేదాలు భగవంతునితో అనుసంధానం గావించాయో, అదే విధంగా గాధాలు కూడా అలాంటివే. వాటిని ప్రజలకు బోధించ సాగాడు. క్రమంగా అది ఒక మతంగా రూపొందింది. అదే జోరాస్ట్రియన్ మతం హిందూమతం మాదిరిగానే,జోరాస్ట్రియన్ మతంలో కూడా సూర్యుణ్ణి,అగ్నిని ఆరాధిస్తారు. హోమాలు నిర్వహిస్తారు. దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. సృష్టికర్త విశ్వ పాలకుడు.ఆయనే అహురమజ్జ అని వారి నమ్మకం వారు ప్రతి మనిషి హృదయంలో ఉంటాడని సత్య ధర్మాన్ని కాపాడుతాడని విశ్వసిస్తారు. భగవంతుడు తన శక్తితో దుష్టశక్తుల్ని శిక్షించడం. మంచి వారిని రక్షించడం,మంచి మాటలు,చేతలు క్రియలనే, హుమత, హుక్త, హోరష్ఝ అనే ముఖ్యమైన బోధలు గా మత ప్రాతిపదిక గా విశ్వసిస్తారు
5 విలువలు
- మంచితనం
- ఏకీభవించడం
- శాంతి
- దానం
- పవిత్రత
పవిత్ర అగ్ని వారి దైవానికి ప్రతీక.లోపల ఉండే హృదయాన్ని బయట కనిపించే అగ్నికి, ప్రతిరూపంగా భావిస్తారు. దేవునికి వేరే ఆకారం లేదు. కేవలం అగ్ని స్వరూపం.ప్రకృతి యొక్క పవిత్రతను, జొరాస్ట్రియన్లు విశ్వసిస్తారు. భగవంతుని ఆభరణం ప్రకృతి. భూమి గాలి అగ్ని నీరు 4 పవిత్రమైన భూతములు మానవులు ఎవరూ వాటిని అపవిత్రం చేయకూడదు. శవాలను సైతం చితిలో కాల్చటం వల్ల కాలుష్యం ఏర్పడుతుందని వారి భావన. అందుకే వారు శవాలను నిశ్శబ్దమైన ఎత్తయిన ప్రదేశంలో సూర్య రశ్మి లో శవాలను ఉంచుతారు. పక్షులకు అవి ఆహారం అని వారి భావన.
జొరాస్ట్రియన్లు 7 సోపానాలు ఏర్పాటు చేశారు వాటిని పాటించాలని వారి మతం బోధిస్తుంది
- దేవుని మీద విశ్వాసం.
- దేవునిపై భక్తి.
- మంచి చెడు గురించి ఆలోచన,మంచి మాటలు, మంచి పనులు చేయటం, ప్రేమను అలవాటు చేసుకోవటం.
- దైవభక్తి ప్రభావంతో సమాజంలోని వివిధ రూపాలపై సానుభూతి.
- మంచి ఆలోచనలు,మాటలు చేతలు, బలవంతుని వలే శక్తి కలిగి ఉండటం.
- పైన పేర్కొన్న వాటి వల్ల శాంతి సమానత్వం కలుగుతుంది.
- మోక్షం పొందుతారు.
సుద్రేష్, కుస్తీ
ప్రతి పార్సీ మతస్థుడు /జోరాస్ట్రియన్ విధిగా సుద్రేష్ అనే పవిత్రమైన వస్త్రాన్ని కుస్తీ ను ధరించాలి వాటిని ఏడు నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు నవజ్యోత్ అనే సంస్కారం ద్వారా ధరింపచేస్తారు. అవి మనస్సును పవిత్రంగా ఉంచుతాయి అనేది వారి విశ్వాసం అవి వారికీ వారి దేవుడైన అహురమజ్జ కు బంధం లాంటిది వాటిని ఊలు తో చేస్తారు పార్సిలు లేదా జొరాస్ట్రియన్ వారికి సుద్రేష్, కుస్తీ యూనిఫారం లాంటివి
జొరాస్ట్రియన్ మత గ్రంధాలు
వారి పవిత్ర మత గ్రంధాలు అవెస్టా పాజెండ్ భాషలో ఉంటాయి. ముఖ్యమైన గాధాలు యశ్న, విశ్వపరాడ్,కోర్దే, అవెస్తా,పాటెట్ మొదలైనవి పర్షియా నుంచి పన్నెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి జొరాస్ట్రియన్లు వచ్చారు. అరబ్ చక్రవర్తుల బారి నుండి రక్షించుకుంటూ గుజరాత్ లోని దీవు తీరానికి చేరారు వారితో పాటు వారి పవిత్ర అగ్ని తీసుకువచ్చారు. వారికి అక్కడ రాజు ఆశ్రయం కలిగించాడు.వారు తమ మత ఆచారాలను కొనసాగిస్తూ మొదట అగ్ని మందిరాన్ని నిర్మించుకున్నారు. వారిని పారిశీలు అంటారు పర్షియా నుంచి వచ్చారు గనుక పారసీలు అంటారు వారు సంఖ్య రీత్యా చాలా చిన్న సమూహం. అయినా వారు తమ గుర్తింపును కాపాడుకుంటూ వారి మత విశ్వాసంతో పరిశుద్ధమైన సంబంధాలతో కొనసాగుతున్నారు.