జైన మతం
హిందూ మతానికి సోదరి వంటిది. జైన మతం క్రీస్తు పూర్వం 800 సంవత్సరంలో భగవాన్ మహావీరుడు స్థాపించాడు. కానీ వేదాల్లో అధికారికంగా గుర్తించలేదు 8వ శతాబ్దంలో కొందరు యజ్ఞయాగాది క్రతువుల్లో జంతువుల్ని బలి ఇవ్వటం వ్యతిరేకించారు. దేవుని సృష్టిలోఅన్నీ పవిత్రమైనవి.మన కోరికల కోసం యజ్ఞం పేరుతో జంతు బలి ఇవ్వటం,నిషేధించాలని కోరారు.కానీ ఆ కాలంలో అది ఆచారంగా ఉండేది. నియమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన సామాన్య జీవితాన్ని కోరేవారు జంతువులకు, క్రిమి కీటకాలకు కూడా హాని చేయరాదని, వారి వాదన. దాన్ని నమ్మినవారు అంతా వర్ధమాన మహావీరుని ఆశ్రయించి వేరే మతాన్ని స్థాపించారు అదే జైన మతం.దీని మూలాలు మాత్రం హిందూ మతానివే. రుషభ దేవుడు గొప్ప రాజు.
కాలానుగుణంగా అతను సన్యాసిగా మారాడు. జైనమతంలో తీర్థంకరులు అనగా సంసార తీరాన్ని దాటిన వారు అని అర్థం. తీర్థంకరులే జైన మతానికి మార్గాన్ని నిర్దేశించారు ఋషభ దేవుడు మొదటి తీర్థంకరుడు వరుసలో 23వ వారు పార్శ్వ నాధ్ 24 వారు వర్ధమాన మహావీరుడు. ఆయన చివరి తీర్థంకరుడు మహావీరుని
జినా అనేవారు జిన అనగా చక్రవర్తి అని అర్ధము. భౌతిక రాజ్యాలను కాక ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని జయించి, ప్రపంచ పోకడలను శాసించే చక్రవర్తి.తనను తాను జయించిన వాడు. ఆత్మ మోక్షానికి చేరడం సిద్ధి పొందటం అని వారి సిద్ధాంతం
వర్ధమాన మహావీరుని జీవిత చరిత్ర
క్షత్రియ వంశానికి చెందిన సిద్ధార్థ, త్రశాల దేవి కుమారుడు మహా వీరుడు.వీరు వైశాలి సామ్రాజ్యం లోని కుండలినీ పురానికి రాజు మరియు రాణి.
చిన్నతనంలో ఎన్నో సాహసకృత్యాలు చేయడంతో వర్ధమానుడు మహావీరుడు గా పేరుగాంచాడు చిన్న ప్రాయం నుండి సుఖాలకు భోగాలకు దూరంగా ఉండేవాడు. అతని మనస్సు ఎప్పుడూ మానవులను బాధలు నుంచి విముక్తి కలిగించాలనే ఆలోచనతో ఉండేది. 30 సంవత్సరాల కే అన్నింటినీ పరిత్యజించాడు 12 సంవత్సరాల పాటు కఠిన అన్వేషణ కొనసాగింది. చివరికి జనన మరణ చక్రం నుంచి బయట బయట పడే సిద్ధాంతంగా కొత్త మత సిద్ధాంతాల తో జైన మతాన్ని స్థాపించాడు.మనిషి జీవిత లక్ష్యం ఆనందంతో, జననమరణాల నుంచి విముక్తి సాధించడా న్నే నిర్వాణం లేదా ముక్తి అంటారు మహావీరుడు తన జీవితం లో 30 సంవత్సరాల పాటు బోధనల ద్వారా ఎంతోమంది అనుయాయులను చేర్చుకున్నారు. తన 72వ ఏట పావాపురి (బీహార్ ) లో నిర్యాణం చెందారు. ఆయన తన బోధనలతో బలమైన జైన మత వర్గాన్ని నెలకొల్పారు అది భారతదేశం అంతా వ్యాపించింది.
జైన మత తత్వం
కేవలం జ్ఞానంతోనే మనిషి తన సర్వ కర్మ నుంచి బయట పడతాడు అనేది జైనుల బలమైన నమ్మకం. జనన మరణ చక్రం నుంచి విడుదల కావాలంటే, కొన్ని నియమాలు పాటించాలి. సన్యాసుల నియమాలు కఠినంగా ఉంటాయి. కానీ గృహస్తుల కు సామాన్యుల కు నియమాలు మిక్కిలి సులభంగా ఉంటాయి
అవి
- అహింస: ఏ ప్రాణిని హింసించ రాదు.వాటిపై దయ చూపించాలి.
- సత్య: ప్రతివారు సత్యాన్నే పలకాలి.
- ఆస్తేయ: దొంగతనం పాపం దొంగతనం చేయరాదు.
- అపరిగ్రహ: లోభత్వం మితిమీరిన సంపద అనర్థదాయకం. జీవనానికి సరిపోయే సంపద చాలు.
- బ్రహ్మచర్య: మనసు మాట చేత పవిత్రంగా ఉండాలి..
జైన మతం ప్రబోధించే 3 జీవన రత్నాలు:-
- సరియగు జ్ఞానము- సమ్యక్ జ్ఞానం
- సరియగు దృష్టి- సమ్యక్ దర్శనం
- సరియగు ప్రవర్తన- సమ్యక్ చరిత్ర
అన్ని బాధల నుంచి,బానిసత్వం నుంచి పై మూడు బోధలు విముక్తి కలిగిస్తాయి. అతి సూక్ష్మమైన క్రిమి కీటకాలకు సైతం రక్షణ కల్పించాలి. జైనులు తరచుగా మాస్క్ ధరిస్తారు. మన నోటి ద్వారా ఎటువంటి హాని ఏ ప్రాణికీ కలుగరాదు. వారు పాదరక్షలు సైతం ధరించరు. ప్రతి అడుగు జీవహింస లేకుండా వేయాలి అని వారి వాదన. తత్వార్థ సూత్ర అనేది వారి మత గ్రంథం. పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం ఉమస్వాతి (ఉమా స్వామి) వారిచే రచించబడింది వారి మత చిహ్నం జై న మత సిద్ధాంతాలకు, మత బోధనలకు ప్రతీక.