సిక్కుమతం
ప్రపంచంలో ఒక అధునాతన మతం సిక్కు మతం. అన్ని మతాలను సమన్వయ పరిచే విధంగా ముఖ్యంగా, హిందూ ముస్లిం మతాలకు సమన్వయం చేకూర్చటం ఈ మతం వారి ప్రయత్నం. 1469 లో లాహోర్ జిల్లాలో తత్వాని అనే గ్రామంలో సిక్కు మత స్థాపకుడు గురునానక్ జన్మించాడు. చిన్నతనం నుండి నానక్ మత ప్రభావం కలిగి ఉండేవారు.తాను పశువులను మేత కోసం తోలుకొని వెళ్ళినప్పుడు,తరుచూ ధ్యానం లోకి వెళ్ళేవారు. హిందువులు తమ అతీంద్రియ శక్తులతో నమ్మకాలతో, ముస్లింలు తమ శారీరకమైన మూఢ భక్తితో మాట్లాడుకునే వారు. హిందూ ముస్లిం లు శాంతి గా సామరస్యంగా జీవించేందుకు రెండు మతాల లోని గొప్ప సూత్రాలను తీసుకొని కొత్త మతాన్ని నెలకొల్పాడు. యుక్తవయసులోనే ప్రేమ సిద్ధాంతాన్ని ప్రచారం గావించాడు. భగవంతునితో అనుసంధానం గావించేది కేవలం ప్రేమ మాత్రమే అని విశ్వసించాడు. సిక్కు మత గ్రంధం గురు గ్రంధ్ సాహెబ్. దానినే గుర్భానీ అంటారు. గురుగ్రంధ సాహిబ్ గ్రంధాన్ని సిక్కులు ఉంచే మందిరాలు గురుద్వారాలు.
గురునానక్ అనుచరులు పది మందిని సిక్కులు అంటారు సిక్కు అనగా నేర్చుకునే వారు లేదా శిష్యుడు పదిమంది సిక్కు గురువులు.
- గురు నానక
- గురు అంగద్
- గురు అమర దాస్
- గురు రాందాస్
- అర్జున్ దేవ్
- గురు హర్ గోవింద్
- గురు హర్ రాయ్
- గురు హర్ కిషన్
- గురు తేజ్ బహదూర్
- గురు గోవింద సింగ్
శాంతి సద్భావన వారి మత పదాలైనా వారి అనుచరులు బలవంతంగా, హింసను ప్రేరేపించే మిలిటెంట్లు గా మారి ఆయుధాలు చేపట్టారు. ముస్లిం పాలకుల నుంచి రక్షించుకునేందుకు గురు గోవింద సింగ్ నాయకత్వంలో యుద్ధాన్ని సాగించారు. అందుకే వారికి సింగ్ అనగా సింహం అనే పదం వారి పేర్లతో కలపబడింది. విగ్రహారాధన పైన నమ్మకం లేదు. వారు కేవలం సాధు, సత్పురుషుల ఉపదేశాలను గానం చేసేవారు. ఈ మతంలో ప్రధానమైంది అంకితభావం మరియు గాఢ భక్తి,. సన్యాసత్వం. జ్యోతిని దేవుని గా పూజిస్తారు. జ్యోతి ధ్యానం చేస్తారు. ఉన్నది ఒకడే దేవుడు, అతడిని సత్పురుష అని అంటారు. అతనే సృష్టికర్త స్థితి కర్త, సిక్కులు వారి గురువులు నియమించిన 5 నిబంధనలు పాటిస్తారు. అవి క అనే అక్షరంతో ప్రారంభమవుతాయి
- కేష్ కేశములు కత్తిరించు రాదు
- కాంగ్వా అనగా దువ్వెన కలిగి ఉండాలి
- కడి స్టీల్ తో చేసిన కడియం ధరిస్తారు
- కృపాణం చిన్న కత్తి కలిగి ఉంటారు
- కచ్చ ఎప్పుడు కౌపీనం ధరిస్తారు
మత సూత్రాలన్నీ హిందూ మతం తో పోలి ఉంటాయి వారు కుల వర్గీకరణ ను నమ్మరు.
ప్రార్థన
- వహే గురు వహే గురు వహే గురూజీ
- బొలో సత్యం సత్యం సత్యం జీ బోలో
మత చిహ్నం
వారి చిహ్నం రెండు వైపులా పదును గా ఉండే కత్తి. ఒకవైపు పదును గా ఉండేది, స్వేచ్ఛ నైతిక విజయం మరియు ఆధ్యాత్మిక విలువలు, ఎడమ వైపు పదును గా ఉండేది దైవ న్యాయం ఎవరైతే తప్పు చేస్తారో వారిని దండిస్తుంది రెండు కత్తుల మధ్య ఒక కత్తి మధ్యలో దాన్ని కదుపుతూ వృత్తాకారం అది దైవం తో ఏకం కావడం ఆది అంతం లేదు రెండు కత్తులు క్రాస్ గా ఉంటాయి అవి ఒకటి ఆధ్యాత్మిక అధికారం రెండవది రాజకీయ శక్తి.