క్రిస్టియన్ మతం
ఎనిమిది వందల మిలియన్ల ప్రజలు అనుసరించే గొప్ప ప్రాముఖ్యం కలిగిన మతం క్రైస్తవ మతం. అన్ని మతాల మాదిరిగానే ఈ మతం పుట్టుక కూడా ఆసియా ఖండమే. ప్రపంచంలోని అన్ని దేశాల్లో విస్తరించింది. క్రీస్తు ఆధారంగా ఈ మతం ఆవిర్భవించింది. బైబిల్ లోని నూతన నిబంధనల లో క్రీస్తు జీవిత చరిత్ర చూడగలం. బైబిల్ క్రిస్టియన్ మత పవిత్ర గ్రంథం.అది ఒక మార్గదర్శి.యాత్రికులకు గమ్యం స్థానం. నమ్మిన వారికి అభయంతో, ఒక రక్షణ రహదారి వంటిది.
ప్రజలు మోజెస్ బోధనలు మర్చిపోయారు గందరగోళం తోసందేహాలు ఏర్పడ్డాయి నైతిక ప్రవర్తన సన్నగిల్లింది దుష్ట శక్తులు తలెత్తాయి దేవుడు ప్రవక్తను కిందికి పంపించాడు అతనే దేవుని కుమారుడు. అతను స్థాపించిన మతమే క్రైస్తవ మతం. దేవుడు ప్రపంచంలోని అందరి ప్రజలను ప్రేమించును కనుకఎ తన కుమారుని పంపెను. దేవుని నమ్మిన వారు నశించరు.శాశ్వతమైన జీవితాన్ని పొందుతారు.
జీసస్ జీవితం
జీసస్ తల్లిదండ్రులు జోసఫ్ మేరీ పవిత్రమైన యూదులు. జోసఫ్ వృత్తి రీత్యా వడ్రంగి.న జరెత్ అనే గ్రామంలో గాలిలీ ప్రాంతాల్లో నివసించేవారు. జీసస్ జన్మించక ముందు అతని తల్లి మేరీకి దేవత ప్రత్యక్షమై దేవుని అనుగ్రహం నీ మీద ప్రసరించింది, భగవంతుడే నీకు కుమారుడుగా జన్మిస్తాడు అని చెప్పింది. ఆమె అప్పటికే జోసెఫ్ ను ఇష్టపడింది. జోసెఫ్ కు కూడా కలలో దేవత కనిపించి, మేరీ ని వివాహం చేసుకోమని,వారికి దేవుడే కుమారుడుగా జన్మిస్తాడని చెప్పింది. వారు తమ కుమారునికి జీసస్ అని పేరు పెట్టారు ఇజ్రాయిల్ అప్పుడు రోమన్ల పాలనలో ఉండేది రాజు ఆజ్ఞప్రకారం ప్రతివారు తమ పేరును అతని సొంత పట్టణంలో నమోదు చేయించుకోవాలి.అది జనాభా లెక్కింపు కొరకు మాత్రమే. తన భార్య అయిన మేరీని తీసుకొని జోసెఫ్ బెత్లేహం పట్టణానికి పేరు నమోదు కోసం వెళ్ళాడు. అక్కడ బాగా రద్దీ గా ఉండటంతో వారు గర్భవతి అయిన మేరీ తో కలిసి ఒక పశువుల కొట్టంలో ఆ రాత్రి నివసించారు. ఆ రాత్రి జీసస్ జన్మించాడు. అది కొన్ని శతాబ్దాల క్రితం నిర్ణయించబడింది. పండితులు జీసస్ జన్మించిన రాత్రి తూర్పున ఒక నక్షత్రం ఉదయించడం చూశారు. ముగ్గురు పండితులు ఆ విషయాన్ని తమ హెరాద్ రాజుకు చెప్పారు. రాజు జన్మించిన పిల్లవాణ్ణి చూసి రమ్మని పంపించాడు. వారు ఆ పిల్లవాడు తర్వాత కాలంలో యూదులకు రాజు కాగలడని చెప్పార పిల్లవాని చిరునామా తెలుసుకుని నాకు చెప్పండి, నేను శిశువుని ఆరాధిస్తాను, అని మోసపూరితంగా రాజు వారికి చెప్పాడు. నక్షత్రం దారి చూపించగా ముగ్గురు పండితులు పిల్లవాడిని కనుగొన్నారు. పవిత్ర మైన గడ్డి మీద పడుకొని ఉన్న పిల్లవాణ్ణి చూశారు భక్తితో కానుకలు సమర్పించారు. దేవత హెచ్చరికతో వారు క్రూరుడైన హెరాద్ రాజుకు తెలియకుండా వెళ్లిపోయారు. గొర్రెల కాపర్లు కూడా ఈ విషయాన్ని దేవత చెప్పటం వల్ల దాచారు. వార్త తెలుసుకున్న ప్రజలు రాసాగారు. దేవత, జోసఫ్ ను మేరీ తో సహా పిల్లవాడిని తీసుకొని, ఈజిప్ట్ వెళ్ళమని అక్కడ నివసించ మని ఆదేశించింది. జోసఫ్ అలాగే చేశాడు. క్రూరుడైన హెరాద్ రెండు సంవత్సరాల లోపు వయస్సు పిల్లలను చంపమని ఆదేశించాడు.
హెరాద్ మరణానంతరం దేవత జోసఫ్ ను తన స్వగ్రామమైన నజరెత్ తిరిగి వెళ్ళమని చెప్పింది జీసస్ బాల్యం గురించి అంతగా ఎవరికి తెలియకపోయినా 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో కలిసి ఒక ఉత్సవం కోసం జెరూసలేం వెళ్ళాడు. అక్కడ జీసస్ తప్పిపోయాడు. మూడు రోజుల తర్వాత జీసస్ ఒక ఆలయంలో పూజారులతో న్యాయం విశ్వాసం గురించి చర్చిస్తూ కనిపించాడు. అప్పుడు అతనిని జ్ఞానిగా కనుగొన్నారు 30 సంవత్సరాల వయస్సు వరకు జీసస్ చరిత్ర ఎవరికీ తెలియదు కానీ సెయింట్ లుకే మాత్రం ఆ కాలంలో జీసస్ దేవునితో గడిపాడని నమ్మాడు.
బాప్టిజం
జాన్ అనే బాప్టిస్ట్ జకారియా ఎలిజిబిత్ ల కుమారుడు. జీసస్ జాన్ ద్వారా బాప్టిజం స్వీకరించాడు. వెంటనే భగవంతుని మాట వినగలిగాడు.ఇతను నా ప్రియమైన కుమారుడు ఇతని వల్ల నేను సంతోషం పొందుతాను అనే వాక్కు స్వర్గం నుంచి వినిపించింది.
జీసస్ కార్యాచరణ
తన ముప్పై సంవత్సరం నుంచి జీసస్ బోధనలను ప్రారంభించాడు. తన కొత్త సంవిధానాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది ప్రచారకులతో కలిసి వెళ్లేవాడు. దైవం యొక్క ప్రేమ క్షమించడం. తోటి ప్రాణులను, దేవుణ్ణి మనిషి ప్రేమించాలి. ప్రార్థన మందిరాలలో గ్రామ గ్రామాల్లో అతడిని శాంతికి రాజుగా కొలిచేవారు. ప్రార్థన శాలలు బహిరంగ స్థలాల్లో బోధలు చేసేవాడు.రోగులకు స్వస్థత చేకూర్చేవాడు.బాధలో ఉన్న వారిని ఆదుకునేవాడు. చనిపోయిన వారిని బతికించడం ముఖ్యంగా జోడో పూజారులకు ఈర్ష్య కలిగించాయి. జీసస్ ను అదుపు చేయాలని లేదా చంపాలని ప్రయత్నించారు.
గెలీలి నుంచి జెరూసలేం కు ఒక ఉత్సవానికి జీసస్ వెళ్ళాడు. అక్కడ ఆతిధ్యం తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక అనుచరుడే పట్టించాడు. అప్పుడు జీసస్ కు 33 ఏళ్ళు. తమ 30 వెండి నాణేలు దొంగిలించాడని వాటిని తిరిగి ఇవ్వమని జీసస్ ని వేధించారు. హింసించారు అతని ని చివరకు సిలువ వేశారు. మేకులతో బంధించారు. ఆ సమయంలో లో జీసస్ తనను హింసించే వాళ్ళను క్షమించమని భగవంతుని ప్రార్థించాడు. తండ్రీ! వారు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు, వీరిని క్షమించు, అని వేడుకున్నాడు. జీసస్ సిలువ వేసిన రోజు శుక్రవారం.అదే ప్రతి సంవత్సరం శుభ శుక్రవారంగా స్మరిస్తారు. మూడో రోజు ఆదివారం ఈస్టర్ జీసస్ భక్తులకు ఆరోజు మరల దర్శనమిచ్చాడు. అదే ఈస్టర్ ఆదివారం 40 రోజులు వారు దర్శించుకున్నారు. 40 వ రోజు వారందరినీ ఓలివస్ పర్వతానికి తీసుకొని వెళ్లి తన మహిమలను లోకానికి చాటమని చెప్పారు ప్రపంచం అంతమయ్యే వరకు తాను భక్తులతో కలిసి ఉంటానని అని చెప్పాడు. స్వర్గం నుంచి తన భక్తులను కాపాడుతానని చెప్పారు.
క్రీస్తు బోధనలు
గత 20 శతాబ్దం నుంచి జీసస్ ఇచ్చిన సూత్రాలు సందేశాలు మానవులను ప్రభావితం గావిస్తున్నాయి.
ముఖ్యమైన బోధలు:
- మీ శత్రువులను కూడా ప్రేమించండి. నీవు నిన్ను అవమానించిన వారి కోసం కూడా ప్రార్ధించు.
- నీవలె,నీ పొరుగు వారిని ప్రేమించు.
- ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు. ఇవ్వటం మరిచిపోవడం. ఏది ఎవరి నుంచీ ఆశించవద్దు దయ చూపించు. స్వర్గంలో ఉన్నా తండ్రిలా కరుణ చూపించు. నీవేం చేసావో ఇతరులు కూడా అలాగే చేయాలని ఆశించవద్దు. నిన్ను నీవు సరిదిద్దుకో. ఇతరులను అంచనా వేయకు. దేవుడు నిన్ను పరీక్షించడు . మీరు ఇతరులను క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు.
- తన అనుచరులను బోధనలు వినటం కన్నా ఆచరించమని చెప్పాడు 5 అన్నం వస్త్రం గూడు కోసం బాధపడకండి. పైన స్వరం లో ఉన్న తండ్రి అన్నీ నీకు సమకూరుస్తాడు. దేవుని సామ్రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వాలి అతనే నీ యోగక్షేమాలు చూస్తాడు.
జీసస్ ఎప్పుడు నైతిక ఉదాహరణలు చెప్పేవారు మొదట్లో క్రిస్టియన్ మతం ఒకటిగా విశ్వమంతా వ్యాపించింది. తర్వాత అది రెండుగా విడిపోయింది
1. క్యాథలిక్ 2. ప్రొటెస్టెంట్
క్యాథలిక్ మతానికి రోమ్ లోని వాటికన్ ప్రధాన మత కేంద్రం. వారి ఆచార్యుడు పోప్. జీసస్ కోరేది,నూతన వ్యక్తిగా మారండి. అహంకారం స్వార్థం వదిలేయండి. స్వర్గం అనేది అది ఆధ్యాత్మిక స్థితి. అది నీ లోనే ఉన్నది. మానవసేవే మాధవసేవ. ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయకారిగా ఉండాలి. పొరుగు వారి బాధ నీ బాధ గా చూడాలి. క్రీస్తు ఇదే ఆచరించాడు తన జీవితమంతా. క్రీస్తు మతం ప్రేమ మతం. మానవ సేవకే అంకితమైన మతం.
మత ప్రార్థన-ఆమెన్
Our father, who art in heaven,
Hallowed be thy name,
Thy kingdom come,
Thy will be done on earth,
As it is in heaven
Give us this daily our daily bread,
And forgive us our trespasses
As we forgive those who trespass against us
And lead us not into temptation
But deliver us from evil.
For Thine is the Kingdom,
The Power and the Glory.
For ever and ever.
Amen