ఇస్లాం మతం
మహమ్మద్ ప్రవక్త స్థాపించిన మతం ఇస్లాం లేదా ముస్లిం మతం. అరబిక్ భాషలో ఇస్లాం అనగా శరణాగతి,సమర్పణం అని అర్థం.
500 AD లో మక్కా నగరంలో మహమ్మద్ జన్మించాడు ఆ కాలంలో అరేబియా లోని అంతటా అనేక సందేహాలతో గందరగోళం తో ప్రజలు ఉండేవారు దేశమంతా చిన్న చిన్న సమూహాలుగా జాతులుగా ప్రజలు విడిపోయి వారిలో వారికి యుద్ధాలు జరిగేవి మహమ్మద్ జన్మించడానికి రెండు నెలల ముందే తండ్రి అబ్దుల్లా చనిపోయాడు. తర్వాత తల్లి అమీనాను కూడా పోగొట్టుకున్నాడు.అప్పుడు అతనికి ఆరు సంవత్సరాలు.అతనిని ముందు తాత తర్వాత అతని బాబాయి పెంచారు.
అతను ఏ విద్య నభ్యసించ లేదు. బాబాయ్ తో కలిసి ఎడారుల కు వెళ్ళేవాడు. చాలా నిజాయితీతో సత్యవాదిగా మంచివాడిగా ఉన్నందున ప్రజలు అతన్ని ఆల్ అమీన్ (నమ్మకస్తుడు) అని పిలిచేవారు. అతను తన 25 వ సంవత్సరంలో సంపన్నురాలైన ఖాడీజా అనే మహిళను వివాహం చేసుకున్నాడు.
వివాహం అయ్యాక కూడా తాను వ్యాపారం మీద దృష్టి పెట్టలేదు. మౌంట్ హీరో పర్వత గుహలో విశ్రాంతిగా ప్రార్థనలు ధ్యానం చేసేవాడు. 40 సంవత్సరాలు వచ్చే వరకు అతనికి దివ్య దర్శనాలు అవటం ప్రారంభమయింది. గార్బిల్ అనే దేవత దేవుడు అతడిని ఎన్నుకున్నాడని, దైవ సందేశాలు వ్యాప్తం చేస్తూ, ఐక్యతను కలిగించమని దైవశక్తితో మానసిక దౌర్బల్యం తో ఉన్న ప్రజలను ఉద్ధరించమని చెప్పింది.
అతను విగ్రహారాధనను వ్యతిరేకించాడు. దైవ మహిమలుగా దేశ ప్రజలు అనుసరించే విధానాలను నిరసించాడు. మక్కా ప్రజలు అతడిని పిచ్చి వాడిగా,గారడీ వాడు గా,తలచి హింసించారు. భరించలేని బాధలకు గురిచేశారు. దాంతో మహమ్మద్ మదీనాకు వలస వెళ్ళాడు. అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతించారు. అతని నూతన నమ్మకాలను అంగీకరించారు. క్రమంగా మహమ్మద్ మదీనా నగరానికి పాలకుడిగా ఎదిగాడు.
బలమైన జాతులకు నాయకుడిగా ఎదిగిన మహమ్మద్, మక్కా నగరాన్ని రక్తపాతం లేకుండా ఆక్రమించాడు. 632 AD లో పవిత్ర మక్కా నగరానికి వచ్చి, అనారోగ్యంతో తనువు చాలించారు. అతని మత సిద్ధాంతాన్ని ఇస్లాం/ ముస్లిం మతంగా ప్రపంచమంతా అంగీకరించింది. ఏడు వందల మిలియన్ల ప్రజలు ఇస్లాం మతాన్ని అనుసరించసాగారు.
నిరాడంబరతకు తోటి వారికి సేవ చేసే విధంగా ఉదాహరణగా అయింది మహమ్మద్ జీవితం. దయ కరుణ సానుభూతి నిజాయితీ కలివిడితనం అతని గుణాలు. ఎంతోమంది అనుచరులు అతనిని అనుసరించారు. తాను బోధించే విషయాలనే అతను ఆచరించి చూపాడు.
పవిత్ర ఖురాన్ మరియు హాదీ
ఇస్లాం మత పవిత్ర గ్రంధం ఖురాన్ గార్బియల్ అనే దేవత ద్వారా ప్రకటించబడింది. కొన్ని ప్రారంభపు అధ్యాయాలు మహమ్మద్ మరియు గాబ్రియల్ నుంచి నేరుగా వచ్చినవే. ఖురాన్ అనగా అరబిక్ భాషలో పారాయణం అని అర్ధము. అది వెలుగునిచ్చేది, స్ఫూర్తి ఇచ్చేది, సరైన మార్గంలో నడిపేది, ఎలా జీవించాలో నేర్పేదని వారి నమ్మకం. 30 అధ్యాయాలుగా రచించబడింది వేదాల వలె ఖురాన్ కూడా శృతి అనగా శ్రవణము ద్వారా వచ్చినదే. అది ఇస్లాం మత గ్రంధంగా ప్రసిద్ధిగాంచింది.
ఇస్లాం మత బోధనలు
అల్లా ఒక్కడే దేవుడు అతనే సృష్టికర్త స్థితి కారుడు. అతనిని అందరూ పూజించాలి. సర్వవ్యాపకుడే కాకుండా సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు. దయ కరుణా మూర్తి. అతడిని పూజించడం అంటే ప్రేమించడమే. అందరినీ సేవించటం ద్వారా అల్లాను పూజించవచ్చు. ధర్మాన్ని వివరిస్తుంది మతం అది దైవాన్ని నమ్మేలా చేస్తుంది. చివరి రోజు అనగా మరణించే రోజు దేవతలు ప్రవక్త ద్వారా అవసరమైన వారితో వితరణ( దానం) చేయిస్తారు. అప్పుడే బానిసత్వం నుంచి విముక్తి. అదే మోక్షం. ఎవరైతే ప్రార్ధిస్తారో, ధ్యానం చేస్తారో, vరోగులకు సేవ చేస్తారో ,వారికి బాధల నుంచి విముక్తి కలిగిస్తాడు దేవుడు. దేవుని యందు భక్తి నిజాయితీ కలిగి ఉండాలి ఇస్లాం మత ముఖ్యమైన ఐదు మూల సూత్రాలు అవి:
- ఉన్నది ఒకటే దేవుడు.మహమ్మద్ అతని దూత. వారి వారి పాప పుణ్యాలకు వారే బాధ్యులు. భూమిపై చేసిన పనులకు సత్కారం లేదా శిక్ష ఆఖరి తీర్పుగా అనుభవిస్తారు అని ఇస్లాం మత నమ్మకం.
- ప్రతి ముస్లిం నమాజు అనగా ప్రార్థన, ప్రతిరోజు ఐదు సార్లు చేయాలి. వేకువలో, ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో నమాజ్ చేయాలి. ఒంటరిగా లేదా సామూహికంగా మక్కా వైపు తిరిగి కూర్చొని చేయాలి.
- రంజాన్ నెల అంతా ఉపవాస దీక్ష చేయాలి. రమదాన్ లేదా పవిత్ర 9వ నెల తానార్ సంవత్సరం పవిత్రమైనది. దేవుడు ఆ నెలలోనే మహమ్మద్ కు పవిత్ర ఖురాన్ అందించాడు.
- జకాత్ అనగా దానం చేయాలి. దానం కూడా పూజ వంటిదే. భగవంతునికి కృతజ్ఞత సమర్పించడమే దానం.అది లోకం నుంచి సంపాదించినదే.
- అవకాశం ఉంటే జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర అనగా, మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి.
ఇవే కాకుండా ఖురాన్ ముస్లింలకు ప్రేమించడం, దయ చూపటం, నిజాయితీతో వ్యాపారం చేయడం, మరియు మద్యపాన నిషేధం సూత్రాలు గా విధించింది. అల్లా యే శరణాగతి శాంతి సామరస్యం, ఇస్లాం మత ధర్మాలు. సాధారణంగా ముస్లింలు అస్సలామ్ మలేకుం (నీకు శాంతి కలుగు గాక) అని పలకరిస్తారు ఎదుటివారు వాలేకుం సలాం (నీకు కూడా శాంతి కలుగుగాక) అని ప్రతిస్పందిస్తారు. అందరూ భగవంతుని నుంచి వచ్చిన వారే, అందుకే జీవితం అల్లాహ్ కు అంకితం చేయాలి. మక్కా లో కాబా గొప్ప మసీదుగా పాలరాతితో నిర్మించబడింది. దానిలో నల్లని వస్త్రం తో ఖురాన్ పవిత్ర గ్రంధం కప్పి ఉంచుతారు.
చంద్ర వంక నక్షత్రం ఇస్లాం మతం చిహ్నం నక్షత్రం లో 5 మూలలు ఉంటాయి. అవి ఇస్లాం మతం లోని 5 సూత్రాలు. చంద్రవంక వారి తొమ్మిదవ తోనార్ నెలను ప్రతిబింబిస్తోంది. రంజాన్ నెల మొదటి చివరి ఉపవాసపు రోజులు చంద్రవంక లోని రెండు కొసలు.
సూఫీ మతం
సూఫీ మతం కూడా ఇస్లాం నుంచి ఆవిర్భవించిందే.భగవంతుని ప్రేమయే సూఫీ మతం అని వారి నమ్మకం.హిందూ మత లక్షణాలు కొన్ని సూఫీ మతంలో కలిగి ఉంటాయి. భగవంతుడు అంతటా ఉన్నాడు అని వారి నమ్మకం.సూఫీలు ఎవరినీ తిరస్కరించరు, అసహ్యించుకోరు.చివరకు నాస్తికుని సైతం. అతనిలో కూడా దేవుడిని చూస్తారు సూఫీ మత ఆచార్యులు, భారతదేశంలోని హిందూ ముస్లింల ఐక్యతను కోరుతారు. ముఖ్యమైన సూఫీ మత సన్యాసులు. 1. బాబా ఫరీద్ గంజ్ షాకర్ 2. నిజాముద్దీన్ 3. బాబా నూరుద్దీన్ అన్ని మతాల ఐక్యతను వారు కోరుతారు.
ముగింపు
భగవంతుని వివిధ శక్తులే వివిధ మతాలు. మానవత్వానికోసం పనిచేసేవే అన్ని మతాలు.
వాటిలో ఒకదానికొకటి వైరుధ్యం లేదు. ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. మతమేదైనా వాటి లక్ష్యం మానవ పురోభివృద్ధి. మానవ జీవిత లక్ష్యాన్ని చేరేందుకు అతనికి సహకరించడమే. మనిషిని మోక్షానికి చేర్చడమే అన్ని మతాల లక్ష్యం.
దైవ పితృత్వం మానవ సోదరత్వం అన్ని మతాల ప్రధాన బోధన.