సృష్టి – దైవం యొక్క ప్రక్షేపన
సృష్టి కార్యంలో వైవిధ్యం, వృద్ధి మరియు మార్పులు ఉంటాయి. అంతేకాకుండా, ఒక్కరే ఉంటే, అనుబంధం ఉండదు; ఒకరు అనేకులుగా మారినప్పుడు అనుబంధం ప్రారంభమవుతుంది మరియు అది వారి గుణాల ద్వారా ఆనందించబడుతుంది. ఎడ్యుకేర్ అంటే సృష్టిలోని అన్ని అంశాలు, మానవ సామర్థ్యం యొక్క అన్ని కేంద్రాల్లో మరియు ప్రకృతిలోని అన్ని అంశాల మధ్య అంతర్లీనమైన, సంపూర్ణమైన పరస్పర సంబంధం ఉందని అర్థం చేసుకోవాలి.
సమస్త సృష్టికి, భగవంతుడే మూల బీజం. ఈ బీజం నుండి అనగా భగవంతుని నుండి, గుణాలు ఉద్భవించాయి. విత్తనం మొలకలా పెరుగుతుంది. వివిధ అభివృద్ధి దశలు అనగా మొలకలు, ముళ్ళు, ఆకులు, పువ్వులు మరియు పండ్లు – ఈ విత్తనం లోనే ఉంటాయి.
-శ్రీ సత్యసాయి (జనవరి 13, 1992)
ఒకేఒక దివ్య సత్యము, ఆధారంగా అనేక వస్తువులను ప్రకృతి ప్రదర్శిస్తుంది. ఇంద్రధనస్సు ‘తెల్లని కాంతి’ యొక్క ఒకే కిరణం నుండి ఉద్భవించింది: ఇంకా మేఘాలు మరియు ఆకాశం నేపథ్యంలో 7 రంగుల వర్ణపటం అనేది ఎప్పటికీ అందం మరియు ఆనందం చేకూరుస్తుంది. సప్తస్వరాల శ్రావ్యమైన కలయిక మంత్రముగ్ధమైన సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుంది: ఇవి అన్ని స్వరాలు గాలిలో ఒత్తిడి ప్రకంపనలు మాత్రమే. అదేవిధంగా, ఈ మొత్తం సృష్టి అంతా ఐదు మూలకాల యొక్క దివ్య ఇంద్రధనస్సు. వైవిధ్యం అనేది ప్రకృతి యొక్క లక్షణం.
పరమాణువు కంటే అతి సూక్ష్మమైన వాటి నుండి అత్యంత భారీ వాటి వరకు సృష్టిలోని అన్ని రూపాలలో దైవత్వం చైతన్యంగా ఉంటుంది. అది శాశ్వత సర్వ సాక్షిగా సృష్టి అంతటా వ్యాపించి ఉంది.’
– శ్రీ సత్యసాయి (15 మే 2000)
ఋగ్వేదంలోని శ్లోకాలు సృష్టి రహస్యం గురించి ఇలా చెబుతున్నాయి:
శూన్యం లో ఒంటరిగా, ఒక శ్వాస (ఊపిరి); చైతన్యం; అంతకు మించి ఏదీ లేదు. చీకటిలో చీకటి దాగి ఉంది. ప్రారంభంలో, పరిపూర్ణత్వమైన ‘నేను’ మాత్రమే ఉంది; ఇంకేమీ లేదు.
‘తన నుండి లోకాలు సృష్టించ బడాలని’ శుధ్ధ పరబ్రహ్మ సంకల్పించాడు. (ఏకోహం బహుష్యాం)
ఓంకారం యొక్క హృదయం నుండి సత్యం వచ్చింది.
మరియు ఈ లోకాలన్నీ వాటి గంభీరమైన కీర్తితో వచ్చాయి.
ఈ సార్వత్రిక మహాసముద్రం నుండి సమయం అనేది వచ్చింది,
ఇది రాత్రీ, పగళ్లను నియమిస్తుంది.
శబ్ద బ్రహ్మమైన ఓంకారం ఈ సృష్టికి దారితీసిన దేవుని మొదటి పదం. విశ్వమంతా ఒకే పరబ్రహ్మ శక్తి నుండి సృష్టించబడింది. దేశ, కాల పరిమితులు ఈ సృష్టి రచనతో ప్రారంభమయ్యాయి. దేశ, కాల పరిస్థితులతో మరియు గుణాలతో అల్లబడిన విశ్వాన్ని(ప్రకృతిని), భగవంతుడు సృష్టించాడు’ అని బాబా వారు అన్నారు.
ఆధునిక శాస్త్రం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తుంది, దీని ప్రకారం అనంత సాంద్రత కలిగిన సూపర్- అణువు సుమారు 15 బిలియన్ సంవత్సరాల క్రితం పేలింది. పరిస్థితి యొక్క ప్రత్యేకత కారణంగా (‘సింగులారిటీ’ అని పిలుస్తారు) బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు ఉన్న దాని గురించి సైన్స్ ఏమీ చెప్పలేకపోయింది; ఆ విధంగా, బిగ్ బ్యాంగ్ తో, సమయం, స్థలం అనే భావన ప్రారంభమైంది. పేలుడు యొక్క ఫలితాలు ఇప్పటికీ ఒకదానికొకటి వేగంగా విస్తరిస్తున్నాయి: అందువలన ఈ చైతన్యశక్తి అంతరిక్షంలో ‘విస్తరిస్తున్న విశ్వం’ చిత్రాన్ని ప్రదర్శిస్తుంది. ప్రారంభ పేలుడు, ప్రకంపనలతో, శూన్యంతో ప్రారంభమైంది: మరియు శాస్త్రవేత్తల ప్రకారం, మొత్తం విశ్వం పేలుడు శబ్దం యొక్క నేపథ్యంతో నిండి ఉంది.
Tఈ విధంగా, సర్వత్రా విస్తరించిన అంతరిక్షం నుండి స్థూలమైన భూమి వరకు, విశ్వం పరిణామం చెందింది. భిన్నత్వంలో ఏకత్వం మరియు దైవత్వం యొక్క ప్రాథమిక సత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఐదు గుణాలు మరియు పంచేంద్రియాలు సృష్టిని అనుభవించడానికి ఇవ్వబడ్డాయి. శబ్దం అనేది అంతరిక్షం యొక్క ఏకైక లక్షణం, ఇది సర్వత్రా వ్యాప్తి చెందింది. భూమి అన్ని మూలకాలలొ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది తనపై తాను భరించే అన్ని రకాల జీవులకు పోషణను అందిస్తుంది. ఆ విధంగా, రేడియేషన్ ద్వారా కంపనం నుండి భౌతికీకరణ వరకు, సృష్టి దైవత్వానికి సాక్షిగా ఉద్భవించింది.
మొత్తం విశ్వం ఐదు ప్రాథమిక అంశాలతో (పంచ భూతాలతో) రూపొందించబడింది. అవి అంతరిక్షం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి. ధ్వని, స్పర్శ, రూపం, రుచి మరియు వాసన వాటి లక్షణాలను సూచిస్తాయి. ఇవన్నీ ప్రాథమిక మూలమైన బీయింగ్- అవేర్ నెస్-బ్లిస్ (సత్-చిత్- ఆనందం) నుండి ఉద్భవించాయి.’
– శ్రీ సత్యసాయి (15 మే 2000)
మూలకం (మహాభూతం) | గుణం | జ్ఞానేంద్రియం |
---|---|---|
అంతరిక్షం (ఆకాశం) | ధ్వని (శబ్ద) | చెవి |
గాలి (వాయు) | + టచ్ (స్పర్ష) | చర్మం |
అగ్ని (అగ్ని, తేజస్) | + ఆకారం (రూప) | దృష్టి (కళ్ళు) |
నీరు (ఆపస్, జల) | + టేస్ట్ (రుచి) | నాలుక |
భూమి (పృథ్వీ) | + వాసన (గంధ) | ముక్కు |
- బహుళత్వం ప్రకృతి లక్షణం.
- ఒక వ్యక్తి అనేకులుగా మారాలని కోరుకున్నాడు.
- సమస్త సృష్టి పరమాత్మ యొక్క ప్రతిబింబం.