ఆలోచన నిర్వహణ
ఆలోచన అనగా ఏమి అన్నది అర్థం చేసుకుందాం. ఒక మంచి ఆలోచన నా మనసులోనికి వచ్చింది. “ఆలోచన అనగా శక్తి యొక్క ప్రకాశము” అని బాబా వారు చెప్పారు. మరి శక్తి అనగా ఏమి? నాలుగో తరగతిలో సామాన్య శాస్త్రాన్ని బోధించేటప్పుడు శక్తి అనగా సామర్థ్యం అని చెప్తాము.
ఆలోచనల వలన శక్తి వినియోగం అవుతుంది. ఈ శక్తి యొక్క ప్రకాశం అంతా ఒకటైనప్పుడు అది మనలో ఒక కోరికను ఏర్పరుస్తుంది. ఈ కోరికలన్నీ కలిసి మనస్సును ఏర్పరుస్తాయి.
బాబా ఈ విషయాన్ని వివరించడానికి ఒక చేతి రుమాలును ఉదాహరణగా చెప్తారు. చేతి రుమాలు పత్తితో తయారు చేస్తారు. పత్తి అన్నది ఆలోచన లాంటిది. మరియు ఒకదానితో నొకటి చేరిన నూలు అనేది కోరిక. మనం ఉన్నిని వడికినప్పుడు, అనగా ఈ దారాలను నేయునప్పుడు, దారం ఒకదానితో ఒకటి కలిసి ఒక చేతిరుమాలు తయారవుతుంది. ఇది మనసు. మెదడు భౌతిక అస్తిత్వం అయితే, మనసు భౌతిక ఆస్తిత్వం కాదు.
నీ మనసు ఎక్కడ ఉంది అని నేను అడిగితే, అది నీ లోపల ఉండొచ్చు లేదా బయట దూరంగా ఎక్కడో కూడా ఉండవచ్చు. ఉదాహరణకు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు సమయం ఉదయం 9:45 అయింది. అప్పుడు ఇంకొక చోట రామాయణం జరుగుతోంది. అప్పుడు మీరు(మీ మనసు) గతవారం మొసలి నోట్లో కాలు పెట్టిన హనుమంతునికి ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉండవచ్చు. అనగా మీ మనసు ఇక్కడ లేదు. అది మీ టెలివిజన్ ముందు ఉంది. మనసు శరీరంలో ఉండకపోవచ్చు కానీ, మీ నియంత్రణలో ఉన్న శరీరంలో దానిని కలిగి ఉండే సామర్ధ్యాన్నే మనస్సు యొక్క నియంత్రణ అంటారు. దానికి మనమే మాస్టారు.
మీకు శుభ్రమైన, తెల్లగా ఉండే చేతి రుమాలు కావాలంటే దానిని ఒక ప్రత్యేకమైన డిటర్జెంట్ తో వుతికితే సరిపోదు. అలాగే నూలు వడకడం వల్ల కూడా సరిపోదు అంటూ బాబా వారు దాని గురించి అద్భుతమైన ఉదాహరణ ఇస్తున్నారు. దానికి తెల్లదనాన్ని తేవాలంటే నాణ్యమైన పత్తి అవసరం. పత్తిలో వ్యర్థ పదార్థాలు లేకుండా, నాణ్యత బాగా ఉంటేనే వస్త్రం తెల్లగా ఉంటుంది.
అదేవిధంగా మన ఆలోచనల నాణ్యతపై నియంత్రణ ఉంటే, మన మనసు బాగుంటుంది. మన దృష్టిని మరొక అతి ముఖ్యమైన ఆలోచన వైపు ఆకర్షిస్తున్నారు బాబా.. ఆలోచన యొక్క వేగం ఎంత? నేను ఈ మైకు ద్వారా మాట్లాడుతున్నాను. ధ్వని తరంగాలు సృష్టించబడి గాలి ద్వారా ప్రయాణిస్తున్నాయి. అవి మన చెవిలోని పొరను చేరి, శ్రవణ కాలువ ద్వారా మెదడును చేరుతాయి. మెదడు వాటిని ఢీకోడ్ (గుప్తలిపిని అనువదించటం) చేస్తుంది. అప్పుడు మీరు వినగలుగుతున్నారు.
ధ్వని 332 మీ/ సెకను అంటే 1120 అడుగులు/సెకను వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి వలన మరియు కాంతి ప్రయాణించుట వలన మీరు నన్ను చూస్తున్నారు. వేగంగా పయనించే కాంతి కారణంగా మీరు నన్ను చూస్తున్నారు. ఈ చర్య చాలా త్వరగా, ఎక్కువ కాలవ్యవధి లేకుండా జరుగుతుంది.
మీరు నన్ను ప్రతిసారీ చూస్తున్నారు. మీరు చూసిన ప్రతిసారి నా నుండి మీ వరకు మరియు మీ నుండి నా వరకు ఒక కాంతికిరణం ప్రయాణిస్తూ ఉంటుంది.
కాంతి సెకండ్ కు 1 లక్ష 86000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది కనుకనే మీరు చూడగల్గుతున్నారు. అంతేకాక ఆకాశం నుండి ఒక కాంతికిరణం భూమిని చేరుకోవటానికి 9 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కళ్ళు మూసుకుని సూర్యున్ని గురించి ఆలోచించమని చెప్తాను. మీకు ఎంత సమయం పడుతుంది. కనురెప్ప పాటు కంటే తక్కువ సమయం. ఆలోచన కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.
ఉదాహరణకు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని తీసుకుందాం. జెమినీ స్టూడియోలో ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. అతను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. బ్రేకులు ఫెయిల్ అయితే అతని ముందు కానీ, వెనక కానీ కారు ఉన్నప్పుడు రెడ్ లైట్ పడినట్లయితే, దాని పర్యవసానంగా ప్రమాదం జరుగుతుంది.
ఎందుకనగా అది నా నియంత్రణ పరిధిలో లేదు. అదేవిధంగా మన ఆలోచనలో బ్రేకింగ్ మెకానిజం లేకపోతే, అంటే నియంత్రణను కోల్పోయి ఆలోచనా ప్రవాహం అమితమైన వేగంతో ఉంటుంది. దాని పర్యవసానంగా గందరగోళం, తీవ్రవాదం ఏర్పడుతుంది.
అమితమైన వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆలోచన శక్తికి, దానిని నియంత్రిణ చేసే యంత్రాన్ని కలిగి ఉండకపోతే చాలా ప్రమాదానికి గురి అవుతాము. ఇది కొత్త విషయం కాదు. కనుక ఆలోచనలను నియంత్రించండి. ఈ జ్ఞానం మనిషికి అందుబాటులో ఉంది.
మహాభారతంలో పాండవుల సోదరులు నలుగురు నీటి కొరకై ఒక సరస్సుకు వెళ్లి మూర్చపోయారు. అప్పుడు యక్షుడు అక్కడికి చేరుకుని, ఓ ధర్మరాజా! నీవు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నీ సోదరులు జీవించరు” అని ధర్మరాజును 40,50 ప్రశ్నలు అడుగుతాడు.
యక్షుడు – గాలి కన్నా వేగంగా ప్రయాణించేది ఏది?
ధర్మరాజు – మానవుని మనస్సు
యక్షుడు – ప్రపంచంలో అన్ని గడ్డి పోచలను దగ్గర చేసి, వానికన్నా అధిక సంఖ్యలో ఉండేది ఏది?
ధర్మరాజు – మానవుని మనసులోని ఆలోచనలు.
ఇది నిజం. ఇది నియంత్రించడానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏకాగ్రత ద్వారా ఆలోచనలను నియంత్రించగల సామర్థ్యం కలిగి ఉంటారు. దానికి బాబా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. మనం ఒక కాగితాన్ని సూర్యరశ్మికి గురి చేసినప్పుడు ఏమీ జరగదు. కానీ మధ్యలో ఒక లెన్స్ని తెచ్చి పెడితే, అప్పుడు ఆ గాఢమైన కాంతి నిప్పుగా మారి కాగితాన్ని కాల్చి వేస్తుంది.
అదేవిధంగా మనము ఈ ఏకాగ్రతను సాధించడానికి ఒక లెన్స్ ని ఉపయోగించాలి. అదే SAI + LENS = Silence. ఆ తర్వాత మళ్లీ మనమే ప్రశ్నించుకోవాలి.
మనం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు నిజంగానే మౌనంగా ఉన్నామా? మన నోరు శబ్దం చేయడంలేదు కనుక మనం మౌనంగా ఉన్నామని తెలుస్తుంది. నోటి నుండి శబ్దం రాకపోయినా మనిషి యొక్క మనసు నిరంతరం సంభాషిస్తూ ఉంటుంది. కనుక మౌనంగా కూర్చున్నట్లయితే మనసు లోని నిరంతర సంభాషణ తగ్గుతుంది.
మనసులోని సంభాషణలు తగ్గటానికి ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటంటే, జ్యోతి ధ్యానము. జ్యోతి ధ్యానంలో జ్యోతి నుండి వచ్చే కాంతి వేగంతో మన ఆలోచన వేగం తగ్గించగలిగితే, అప్పుడు ఆ కాంతి పూర్తిగా మన అంతరంగం లోనికి వెళ్లి, ప్రకాశాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనినే మనం అంతర్దృష్టి అంటాము. మనం అంతర్ దృష్టిని కలిగి ఉండాలనుకున్నప్పుడు, ఆలోచనలను నియంత్రించి నిశ్శబ్దంగా కూర్చోవడమే ఉత్తమము. కనక ఈ ధ్యానాన్ని తల్లిదండ్రులను చేయమని చెప్పడం జరిగింది. సాయి భక్తులు ప్రతిరోజూ చేస్తారు.. అది ఎప్పుడు చేయాలి? మీరు ఆఫీసుకు వెళ్లే ముందు దయచేసి కూర్చుని రెండు నిమిషాలు మీ ఆలోచనలను నియంత్రించి, ఆపై ఏం జరుగుతుందో చూడండి మీకే తెలుస్తుంది. బాబా ఒక గడియారాన్ని ఉదాహరణగా చెప్పారు. వైన్డింగ్ చేయడానికి కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు పడుతుంది. దానివలన అది 24 గంటలు పని చేస్తుంది. అంటే, ఎప్పుడు స్వీయ తనిఖీ చేయటం అవసరం. ఇది అసాధారణమైన ప్రక్రియ కాదు. రోజువారి ప్రక్రియ. మనం నిద్రించే ముందు తప్పనిసరిగా, ఆరోజుఉదయం నుంచి ఏం చేసాము? అన్నది స్వీయ తనిఖీ చేసుకోవాలి. భగవాన్ సందేశానికి మనం ఎక్కడ విరుద్ధంగా ఉన్నాము? మనం ఎక్కడ ధర్మాన్ని ఉల్లంఘించాము? ఇలా తనిఖీ చేసుకుంటూ, మళ్లీ మనం భగవంతుని ఓడిపోకూడదని ప్రార్థించాలి. ఈరోజు ఉదయం కూర్చుని, మనకి సహకరించని శరీర అవయవానికి జ్యోతిని తీసుకుని వెళ్ళండి. క్రిందటి రోజు ఉదాహరణకు తప్పుగా ఉచ్చరించిన నాలుక. బాబా చెప్తారు “మీరు నాతో శారీరకంగా కాకుండా మానసికంగా అందరూ బాగుండాలని కోరుకోండి”. మనం బాగుండకపోతే, దైవానుగ్రహం రెట్టింపుగా ఎలా వస్తుంది. కనుక నిశ్శబ్దంగా కూర్చుంటే, ఆలోచన స్వీయతనిఖీ వైపు దారితీస్తుంది. (మూలము: ది పాత్ డివైన్. శ్రీ సత్య సాయి బాలవికాస్. ధర్మక్షేత్ర. ముంబై)