అడవి లో కార్చిచ్చు

Print Friendly, PDF & Email
అడవి లో కార్చిచ్చు

దినచర్యలో భాగంగా శ్రీ కృష్ణుడు బలరాముడు గోపాలురు వారి గోవుల్ని తోలుకొని అడవికి వెళ్ళారు. కొంతదూరం వెళ్లాక శ్రీ కృష్ణుడు తన మురళి వాయించడం మొదలుపెట్టాడు. దాంతో గోపాలురు కూడా ఆడటం పాడటం నృత్యం చేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ గోపాలురు మురళీ గానాన్ని వింటూ పరవశించేవారు. వేణు నాదంతో తమ శరీరాలను మరచిపోతూ ఆడి పాడేవారు. ఆ ఆనందంలో తమ గోవులను దూడలను మరిచి పోయేవారు. ఆరోజు తేరుకుని చూస్తే పశువులు ఎక్కడా కనిపించలేదు.

ఒక్కొక్కరూ ఒక్కో వైపు వెతికారు కానీ అవి ఎక్కడా కనిపించలేదు. భయంతో వారు అడవి లోపలికి వెళ్ళారు. చివరగా వారు అడవిలో పెద్ద మంటల మధ్య ఆవులు మేస్తున్నట్లు గమనించారు కానీ అడవి అంతా పొగతో అస్పష్టంగా ఉంది. గోపాలురు కృష్ణా కృష్ణా అని అరిస్తే బలరాముడు శ్రీ కృష్ణుడు అక్కడికి వచ్చారు. అప్పటికే మంటలు అంతా వ్యాపించాయి. ఏం జరిగిందో గోపాలురు చెప్పలేకపోయారు. కృష్ణుడు గోవులను వాటి పేర్లతో పిలిచాడు. గోవులు శ్రీ కృష్ణుడి స్వరం విని అంబా అంబా అని ప్రతిస్పందించాయి. ఆవులు శబ్ద బ్రహ్మాన్ని గుర్తించాయి వాటికి విద్య, జ్ఞానం లేదు అయినా భగవంతుని స్వరాన్ని గుర్తించాయి.

కృష్ణుడు బలరాముడు మంటల్లోకి దూసుకుపోయారు. ఏమౌతుందో అని ప్రాణ భయంతో ఉన్న గోపాలురతో మీరు అడవిలో చాలా దూరం వెళ్ళారు. మీకేం భయం లేదు మీరు కళ్ళు మూసుకుని మేం చెప్పే వరకు తెరవకండి అన్నారు. చుట్టూ అగ్ని దాని వేడి అనుభూతి చెందారు. కళ్ళు మూసుకున్నారు. వారికి ఇది కొత్త కాదు ఎప్పుడూ శ్రీ కృష్ణుడి పట్ల విధేయత చూపడం వారి ధర్మం. గోపాలురు ఎప్పుడూ ప్రశ్నించే వారు కాదు ఇది చేయండి అంటే చేయడం, వెళ్ళండి అంటే వెళ్ళడం సందేహాలు సంకోచాలు లేవు అందుకే వారు భగవంతుని శాశ్వత రక్షణలో ఉన్నారు.

కొన్ని క్షణాల తర్వాత కళ్లు తెరవండి అన్నాడు వారు చల్లని గాలి తగిలే తమ పొలాల్లో ఉన్నారు. అగ్ని ఏమైంది ఎక్కడికి పోయింది తాము ఆడి పాడి నృత్యం చేసిన పొలంలో తమ గోవులతొ ఉన్నారు. ఈ అద్భుతం ఎలా జరిగిందో అర్థం కాలేదు. కృష్ణునితో ‘ఓ నారాయణా నీకు ప్రారంభం అంతం లేదు నిస్సహాయకులకు రక్షకుడివి పరమేశ్వరుడివి నీవు నీ అద్భుత లీలలను అనుభవించిన మేం అదృష్టవంతులం’ అని పాదాల మీద పడ్డారు.

అది ఎంత కాలం? కొద్ది నిమిషాలు మాత్రమే తర్వాత అద్భుతాన్ని మరిచి పోయారు. మళ్లీ తమ ఆట పాటల్లోకి పిలిచారు. ఆయన్ని ప్రభువు అని పిలవడం మరిచారు. చూసారా శారీరక ఆకర్షణలు మనల్ని ఎంతగా లాగుతాయో. ఏదైనా అద్బుతం జరిగితే ఆయన శక్తివంతుడు అనుకుంటారు. మళ్లీ నిమిషాల్లో మరిచి పోయి ఆయన సాధారణ మనిషి అనుకుంటారు. ఏం అవతారంలో అయినా వారి గురించి మానవులు మానవ దైవిక సంబంధంలో వ్యత్యాసంతో ఉంటారు. ఎందుకు? మనుషులు ఎప్పుడూ శారీరక స్పృహ లో ఎప్పుడూ ఉంటారు. ప్రాపంచిక విషయాల్లో తమ జీవితానికి మించిన దైవత్వాన్ని అర్థం చేసుకోలేరు. గోపాలురు కూడా అంతే కృష్ణుడి బలాన్ని మరియు తెలివిని మెచ్చుకునే వారు కానీ అతడి దైవత్వాన్ని కాదు.

27/9/1995 ఉపన్యాసం

స్థలం: బృందావనం

సందర్భం; వేసవి తరగతులు 1995

ఉపన్యాస సేకరణ – వేసవి జల్లులు 1995

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *