జై జై జై మనమోహన
- మనమోహన
- మధుసూదన
- కేశవ
- మాధవ
- గోపాల
మనమోహన
“మోహన” అంటే, మంత్రముగ్ధులను చేసి ఆకర్షించేవాడు”. “మనమోహన” కృష్ణుడి నీ వర్ణించే పేరు, ఎందుకంటే అతను తన ప్రేమతో అందరి హృదయాలను , మనస్సులను బంధిస్తాడు!
మధుసూదన
“మధుసూధన” అనేది కృష్ణుడి యొక్క పేరు. మధు అనే దుష్ట రాక్షసుడిని సంహరించినవాడు అని అర్థం. “మధు” అనే పదం వేదాంత మరియు తత్వశాస్త్రంలో మన కర్మఫలాలను సూచిస్తుంది. భగవంతుడు తనను ధ్యానించిన వారి క్రియల ఫలాలను నాశనం చేస్తాడు కాబట్టి. అతన్ని మధుసూదన అని పిలుస్తారు. స్వామి అన్నారు “మధు” అంటే తేనె కంటే తియ్యనిది అని ,మరి మానవులకు తేనె కంటే తియ్యనిది ఏమిటి? మన అహం! అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయగల భగవంతుడిని మధుసూధనుడు అంటారు. కాబట్టి మనం మన చర్యలకు ప్రభువు, అత్యంత అందమైనవాడు, అత్యంత రహస్యమైనవాడు మరియు ఇప్పుడు మన మధ్యలో నివసించే అందమైన సత్యసాయిగా భగవంతుడిని కీర్తిస్తాము.
కేశవ
అంటే అందమైన వెంట్రుకలు కలిగిన ప్రభువు. కేశవ అనే పేరు కృష్ణ అవతారంలో ‘కేశి’ అనే రాక్షసుడిని సంహరించడాన్ని సూచిస్తుంది. ఇది శ్రీ ఆదిశంకరులు చెప్పిన నిర్వచనం .విష్ణు పురాణం లో కూడా చెప్పబడింది. చిన్న కృష్ణుడిని చంపడానికి కృష్ణుని మామ అయిన కంసుడు కేశిని పంపాడు. కానీ అతను చిన్న గోపాలుడి చేతిలో మరణించాడు. ఆది శంకరుడు ఇచ్చిన మరొక అర్థం ఉంది, “కేశ” అనేది సూర్యుని నుండి వెలువడే కిరణాలకు పేరు. కృష్ణుడు సూర్యుడు, చంద్రుడు మరియు విశ్వంలోని ప్రకాశించే అన్ని వస్తువులకు మూలంగా పరిగణించబడ్డాడు. కాబట్టి అతన్ని “కేశవ” అని పిలుస్తారు. ఆది శంకరుడు మహాభారతం లో ఈ విధంగా కృష్ణుడి తన గురించి వివరించాడు అని చెప్పారు. కృష్ణుడు భగవద్గీతలో “నా నుండి వెలువడే కిరణాలను ‘కేసస్’ అంటారు. కాబట్టి పండిత బ్రాహ్మణులు నన్ను కేశవ అని పిలుస్తుంటారు” అని అన్నారు.
మాధవ
మాధవ “మ” మరియు “ధవ” పదాల నుండి వచ్చింది. “మా” అంటే లక్ష్మీ దేవి అని అర్ధం. లక్ష్మి అమ్మవారు సంపదలకు, ధనమునకు దేవత. “ధవ” అంటే భగవంతుడు. శ్రీకృష్ణుడు: విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు, అతని భార్య లక్ష్మి అమ్మవారు. అందువల్ల కృష్ణుడు మాధవ అనే పేరును కలిగి ఉన్నాడు. అంతర్గత ప్రాముఖ్యత ఏమిటంటే, ఇక్కడ లక్ష్మీదేవి అంటే ప్రకృతి. అంటే భగవంతుని లో విడదీయరాని భాగం. నిజానికి సృష్టి సృష్టికర్త యొక్క ప్రతిబింబం. అందుకే ప్రకృతికి లేదా సృష్టికి మూలకర్త అయిన భగవంతుడు మాధవుడు.
గోపాల
“గో” అంటే ఆవులు. “పాల” అంటే రక్షించడం. శ్రీకృష్ణుడు మధురలో వసుదేవుడు, దేవకి దంపతులకు జన్మించాడు కానీ యశోద, నందులు అతనిని పెంచిన తల్లిదండ్రులు. వారు గోకులానికి చెందినవారు.కృష్ణుడు తన వయస్సులో ఉన్న ఇతర అబ్బాయిలతో పెరిగి గోవులను ప్రేమగా కాచేవాడు.ఆ విధంగా గోపాలుడు అయ్యాడు. “గో” అంటే వ్యక్తులు అని బాబా వివరించారు. వ్యక్తులను రక్షించి, వారి ఆత్మలకు శాంతి మరియు ఆనందాని అందించి పాలించేవాడు గోపాలుడు. ఆయననే మనలను కాపాడే భగవంతుడు.