హిందూ మతం

Print Friendly, PDF & Email
హిందూ మతం

అన్ని మతాల కన్నా హిందూ మతం చాలా ప్రాచీనమైనది. జైన మతం, బౌద్ధమతం, హిందూ మతం నుంచి వచ్చినవి. వాటిని హిందూ మతానికి సోదర మతాలు అంటారు. హిందూ మతానికి సరైన పేరు సనాతన ధర్మం. సృష్టి,స్థితులకు రక్షణ కలిగించేది మతం. సనాతన అనగా శాశ్వతమైనది అన్ని అర్ధం.దీని సిద్ధాంతాలు విలువలు శాశ్వతంగా నిలిచేవి. వేదాలు దీనికి మూలాలు.అందుకే దీన్ని వేదాంతం అని వైదిక ధర్మం అని పిలుస్తారు. ఇది మానవ జీవన ప్రయాణం లో సత్ప్రవర్తనకు మార్గాలు నిర్దేశిస్తుంది.

సింధూ నది ప్రాంతాల్లో నివసించే వారిని హిందువులు అని పిలిచేవారు. భగవాన్ బాబా వారు దీనికి ఆధ్యాత్మిక అర్ధాన్ని చెప్పారు హింసకు దూరంగా ఉండేవాడు హిందువు అని. అహింసా పరమో ధర్మః! హింసకు దూరంగా ఉంటూ సర్వ ప్రాణుల యందు ప్రేమ కలిగి ఉండి ఆలోచనల్లో మాటల్లో చేతల్లో అహింసయే ఉండాలి. సర్వ సృష్టి భగవంతుడు సృష్టింపబడినదే ఈశావాస్యమిదం సర్వం ఇదే హిందూ మత మూలమంత్రం. భ అనగా భగవంతుడు. రత అంటే ఇష్టం అదే భారతదేశం భారత అంటే భగవంతుని యందు ఇష్టం కలిగినది. గాఢంగా దేవుని ప్రేమించే భూమి భారతభూమి.హిందూ, భారత పదాల అర్ధాలే హిందూ మత సారం. హిందూమతం పురాతనం. ధర్మ యుక్తమైన విశ్వ మార్గాన్ని నిర్దేశిస్తుంది.హిందూమతం యొక్క ముఖ్య బోధనలు.

  1. సహజ శక్తులు దైవం యొక్క సూచనలు: ప్రకృతి శక్తులు భూమి,అగ్ని, గాలి,నీరు అన్నీ జీవశక్తిని కలిగిస్తాయి అలాగే హరింప చేస్తాయి అన్నీ భగవత్ తత్వాలు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనగా ఒకే భగవత్ తత్వాన్ని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు.
  2. ప్రతి వారిలోని అంతఃకరణం భగవంతుని సంకల్పమే: ఎలాగైతే బహిరంగ లోని శక్తులన్నీ భగవత్తత్వమో,అదే విధంగా ప్రతి వారిలో ఆత్మ స్వరూపునిగా దేవుడు ఉంటాడు. వైయక్తిక ఆత్మలన్నీఅగ్నిలోని నిప్పురవ్వల వంటివే.ఉన్నది ఒకటే సత్యం అందుకే దాన్ని తత్వమసి అని ప్రకటించారు. ఆత్మ శరీరం నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛగా భగవంతునిలో ఐక్యం కావటమే మానవ జీవిత లక్ష్యం.జనన మరణ చక్రం నుంచి విడిబడి భగవంతుని తో కలిసి పోవడం మోక్షం.
  3. ఏ రూపంలో నైనా భగవంతుని పూజించవచ్చు: అసంఖ్యాక రూపాలు నామాలు, తనకు నచ్చిన రూపంలో ఇష్టదేవత ఆరాధన చేయవచ్చు.
  4. ఏకత్వ స్థితి జీవనం: భగవంతుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఉన్నాడు. మన ప్రేమకు, ఆరాధనకు,సృష్టిలోని అందరూ అర్హులే.”ఈశావాస్య మిదం సర్వం” హిందూ మతానికి ప్రధాన సూత్రం
మన గ్రంధాలు ప్రస్థానత్రయం

హిందూ మత గ్రంథాలు రెండు రకాలు. ఒకటి శృతులు, రెండవది స్మృతులు. శృతులు అనగా శ్రవణం చేయబడినవి. మహర్షులు అలౌకికమైన సత్యాన్ని శ్రవణం చేసి మతానికి అందించారు. శృతులు, వేదములు హిందుత్వానికి పునాది. విత్ నుంచి వచ్చింది వేదం. విత్ అనగా తెలుసుకొనుట అని అర్ధము.వేదాలు లెక్కలేనన్ని ఉన్నా వ్యాసుడు 4 వేదాలు గా విభజించి బోధించాడు

  1. పైలునికి ఋగ్వేదం
  2. వైశంపాయనునికి యజుర్వేదం
  3. జైమునికి సామవేదం
  4. సుమంతునికి అధర్వణ వేదం

ప్రతి వేదం తిరిగి మూడు విభాగాలుగా ఉంటుంది:

  1. సంహితలు లేదా మంత్రములు.
  2. బ్రాహ్మణ్యాలు
  3. అరణ్యకాలు

అరణ్యకాల అధ్యాయాలే ఉపనిషత్తులు. వీటినే వేదాంతము అంటారు. వేదము యొక్క ముగింపు వేదాంతం. ఉపనిషత్తు అనే పదానికి సంస్కృత అర్థం. ‘ఉప’ అనగా దగ్గరగా ని అనగా క్రింద షట్ అనగా కూర్చోవటం గురువు పాదాల దగ్గర కూర్చోవడం పాదాల చెంత కూర్చుని శ్రద్ధతో, భక్తితో,వినటం,నేర్చుకోవటం.

ముఖ్యమైన ఉపనిషత్తులు

1. ఈశావాస్యోపనిషత్తు. 2. కేనోపనిషత్తు. 3. కథోపనిషత్తు. 4. ప్రశ్నోపనిషత్తు. 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తరీయ ఉపనిషత్తు, 8.ఐతరేయ ఉపనిషత్తు, 9 చాందోగ్య ఉపనిషత్తు, 10. బృహదారణ్యక ఉపనిషత్తు.

II. స్మృతులు:

ఇవి రెండవ శ్రేణికి సంబంధించినవి.

  1. స్మృతులు న్యాయ సూత్రాలు ధర్మశాస్త్రాలు. మనువు యాజ్ఞవల్క్య పరాశర మహర్షుల చే అందించబడినవి అన్ని స్థాయిల్లోని మానవ ధర్మాలు ఉపదేశించేవి.
  2. ఇతిహాసాలు: రామాయణ, మహాభారతాలు
  3. పురాణాలు: భగవంతుని వివిధ అవతారాలను తెలిపేవి 18 పురాణాలు. వాటిలో ప్రసిద్ధిచెందిన పురాణాలు, ఒకటి విష్ణు పురాణం రెండు భాగవత పురాణం
  4. ఆగమములు లేక భగవంతుని ఆరాధన
  5. దర్శనములు ఆధ్యాత్మిక వేదాంత సూత్రాలు.

మూడు విధములైన తత్వములు

  1. ద్వైతం– మధ్వాచార్యుల తత్త్వం . దీని ప్రకారం జీవుడు,దేవుడు వేరు .భగవంతుని ఆరాధన ద్వారా జీవుడు, ఆనందాన్ని అనుగ్రహాన్ని పొందుతాడు.
  2. అద్వైతం– శ్రీ శంకరాచార్యుల తత్వం. విశ్వమంతా వ్యాపించిన తత్త్వం ఒక్కటే వివిధ రూపాల్లో ఉన్న భగవంతుడు ఒక్కడే దేవుడు సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. అందుచే ఎవరికి కి బాధ కలిగించినా, నీకు బాధ కలిగించేనట్లే. అందరినీ నిను నీవు ప్రేమించు విధంగా నీవు ప్రేమించవలెను.
  3. విశిష్టాద్వైతం– శ్రీ రామానుజాచార్యులు తత్వం. ఉన్నది ఒకటే అనే శ్రీ శంకరాచార్య సిద్ధాంతాన్ని అందరూ అర్ధం చేసుకో లేకపోయారు. దీనికి రామానుజులు, మనిషి తన భక్తితో దేవుని లో ఐక్యం కాగలడని వివరించాడు వేదాంత దర్శనములు వివిధ అంతరార్థాలను వివరించాయి .అన్ని మత గ్రంథాలలో కెల్లా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు భగవద్గీత ప్రముఖమైనవి వీటిని ప్రస్థానత్రయం అంటారు సంసార సాగరాన్ని దాటే మార్గాన్ని ఇవి సూచిం చాయి.
హిందూ నైతిక సూత్రాలు ధర్మ సూత్రాలు

పవిత్రత, నైతికత లేకుండా ఎవ్వరూ ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించి ప్రగతి సాధించేందుకు మహర్షులు నాలుగు జీవిత లక్ష్యాలను అందించారు. అవే పురుషార్ధాలు.–

  1. ధర్మము(సరైన ప్రవర్తన)
  2. అర్థ (ధనము)
  3. కామ (కోరికలు)
  4. మోక్షము ( ముక్తి )

అర్ధమును సంపాదించుటలో, కోర్కెలు తీర్చుకొనుటలో వ్యక్తి ధర్మమును అనుసరించాలి. మానవ జీవన లక్ష్యము ముక్తి ని లేదా మోక్షాన్ని సాధించుట. ధర్మమును అనుసరించక,అక్రమ మార్గాల ద్వారా ఆర్జించిన సంపాదన విషాదమునే మిగులుస్తుంది. నిజమైన సంతోషం పొందాలంటే సక్రమమైన మార్గాలను ద్వారానే డబ్బు సంపాదించాలి. డబ్బు, భవనాలే సంపద కాదు. శీలమే నిజమైన సంపద. ధర్మమును ఆచరించే వారిని ధర్మము రక్షిస్తుంది.

జీవితం లోని నాలుగు దశలకు విధులను కూడా పొందు పరచారు.-అవి

  1. బ్రహ్మచార్యాశ్రమము: ఇది విద్యార్థి దశ.
    బాల్యం మరియు యువత యొక్క ఈ దశ వారి జీవితానికి పునాది. ఈ దశ లో జ్ఞానం మరియు సంస్కృతిని పొందడం, శీల నిర్మాణము మరియు ఆరోగ్యకరమైన శరీరం యొక్క అభివృద్ధికి అంకితం చేయాలి.
  2. గృహస్థాశ్రమం: గృహస్థ దశ.ఈ దశలో, ఒకరి స్వంత పురోగతి మరియు కుటుంబం యొక్క పురోగతికి మాత్రమే కాకుండా, సామజిక పురోగతి కోసం కూడా శ్రద్ధ వహించాలి.
  3. వానప్రస్థాశ్రమం: ప్రాపంచిక జీవితం నుండి విరమణ మరియు అడవికి వెళ్లడం. ఇది ప్రాపంచిక కార్యకలాపాల నుండి విరమణ మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో తనను తాను నిమగ్నం చేసుకోవడాన్ని సూచిస్తుంది.
  4. సన్యాసశ్రమ: సంపూర్ణ పరిత్యాగం.

కుల వ్యవస్థ అనేది సమాజంలోని ఉమ్మడి ప్రయోజనాల కోసం అన్యోన్య సహకార విభాగం. ఇవి 4 కులాలు.

  1. బ్రాహ్మణులు– సమాజానికి ఆధ్యాత్మిక సంరక్షకులు ఉదా. పూజారులు.
  2. క్షత్రియులు– సమాజ సంరక్షకులు ఉదా రాజులు, ప్రభువులు మరియు యువరాజులు.
  3. వైశ్యులు– ప్రజల వాణిజ్య అవసరాలను చూసుకుంటారు ఉదా. రైతులు, వ్యాపారులు
  4. శూద్రులు– సమాజానికి ప్రధాన శ్రామిక శక్తి, ఉదా. పారిశుధ్యపు పని వారు.

వారు శారీరక శ్రమతో సమాజానికి దోహదపడతారు. ప్రతి తరగతి వారు చేసే పని ముఖ్యమైనదే, ఏ పని ఎక్కువ లేదా తక్కువ కాదు. అంటరానితనం, స్వార్థపరులచే ఆచరించబడినది. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అంటరానితనం హిందూ మతానికే కళంకము.

స్వామి చెప్పారు, “ఉన్నది ఒక్కటే కులం- అదే మానవకులం”.

జీవితంలోని ప్రతి కర్తవ్యాన్ని సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మరియు అహింస అనేవిలువలతో కూడి నిర్వహించాలి.

కర్మ చట్టం మరియు పునర్జన్మ సిద్ధాంతం

ఇది హిందూ మతం యొక్క ముఖ్యమైన సిద్ధాంతము. కర్మ అంటే చర్య లేదా పని మరియు ఫలమంటే దాని పరిణామం. “ఎట్టి విత్తో అట్టి పంట” అన్నట్లు మనము చేసే ప్రతి ఆలోచన, మాట, చేతలు యొక్క పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇప్పుడు మంచి లేదా చెడు పనుల ఫలితము తరువాతి జన్మలో. మంచిని శాంతిని లేదా బాధను కలిగిస్తాయి. కర్మలలో ౩ రకాలు ఉన్నాయి:-

  1. ప్రారబ్ద కర్మ: మనిషి కి తన ప్రస్తుత జీవితంలో ఫలాలను ఇవ్వడం ప్రారంభించిన కర్మ. దీనిని నివారించలేము.
  2. సంచిత కర్మ: ఒక వ్యక్తి యొక్క మునుపటి జీవితాల యొక్క పేరుకుపోయిన కర్మకు ఇవ్వబడిన పేరు, ఇది అతని ప్రస్తుత పాత్రను నిర్ణయించింది.
  3. ఆగామి (లేదా క్రియామన) కర్మ: ప్రస్తుత జీవితంలో ఇప్పుడు సృష్టించబడిన కర్మ మరియు దాని ఫలాలు భవిష్యత్తులో మనకు వస్తాయి.

దీనిని వివరించే ఒక సాధారణ సారూప్యత ఉంది: ధాన్యాగారంలో నిల్వ చేయబడిన ధాన్యాల నిల్వ గత జీవితాల సంచిత కర్మ అయిన సాంచిత కర్మను సూచిస్తుంది. మన ప్రస్తుత ఉపయోగం కోసం ధాన్యాగారం నుండి తీసుకున్న ధాన్యం భాగం, మన ప్రస్తుత జీవితానికి బాధ్యత వహించే ప్రారబ్ద కర్మను సూచిస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న పంట మన ప్రస్తుత కర్మ, ఇది ధాన్యాగారంలోకి తిరిగి జోడించినప్పుడు సాంచిత కర్మ అవుతుంది.

మనం భగవంతుని వద్ద శరణాగతి పొంది మన కర్మల యొక్క ఫలాలను ఆశించకుండా, భగవంతుడిని ఆరాధించే చర్యగా ప్రతిదీ చేస్తే కర్మ చట్టం మనల్ని బంధించదు. ఈ రకమైన చర్యను నిష్కామకర్మ లేదా కర్మ యోగం అంటారు. అలాంటి భక్తుడు ఎల్లప్పుడూ భగవంతునిచే రక్షించబడతాడు.మరియు జీవితంలోని కష్టాలను ఎప్పటికీ అనుభవించడు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ‘ఇదం న మమ’ (ఇది నాది కాదు) “ఈశ్వరార్పణం” అని మనం చేసే అన్ని కర్మల సమయంలో గుర్తుంచుకోవాలి.

బాబా చెప్పారు, “సంతోషాలు మరియు బాధలు మీ స్వయంకృతములు. మొదట, ఈ సత్యాన్ని గుర్తించండి. అప్పుడు మంచి జీవితాన్ని మరియు మరణానంతర జీవితాన్ని పొందడానికి మంచి ఆలోచనలు, మాటలు మరియు పనులలో పాల్గొనండి. మనము ఎంత చేస్తే అంత ఫలితాన్ని పొందుతాము. ఎక్కువ, తక్కువ కాదు. ఇలా చెప్పిన తర్వాత, ర్తుంచుకోండి: మీ చెడ్డ కర్మల కుప్ప ఎంత పెద్దదైనా, మీ గుండె లోతు నుండి వెలువడే నిజమైన భావనతో మీరు దేవుణ్ణి ప్రార్థిస్తే, వేసవి కాలంలో మంచులా అన్ని కర్మలు అదృశ్యమవుతాయి.”

కాబట్టి, మనం చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, భగవంతుని దయను సంపాదించడానికి ప్రయత్నించడం.

అవతార లక్ష్యాలు అవతరించడం అంటే దిగిరావడం. అవతారాలు హిందూమతంలో ప్రత్యేకత కలిగినవి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు ధర్మాన్ని రక్షించేందుకు భూమిపై అవతరిస్తాడు అని చెప్పాడు.మహర్షులు సాధువులు సత్పురుషులుధర్మాన్ని రక్షించుటకు వచ్చిన అవతారాలు గా చెప్పవచ్చు.

హిందూమతంలోని దశావతారాలు:- హిందూ మతం లో పది అవతారాల ని విశ్వసిస్తారు,

1. మత్స్య, 2. కూర్మా, 3, వరాహ, 4. నరసింహ, 5. వామన, 6. పరశురామ, 7. శ్రీరామ, 8. శ్రీకృష్ణ, 9. బుద్ధ, 10. కల్కి.

పసిబిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లి కిందికి వంగి ఎలా ఎత్తుకుంటుందో అదేవిధంగా భగవంతుడు ప్రేమ అభిమానం తో మానవుని మాధవునిగా మార్చుటకు అవతరిస్తాడు అని బాబా అంటారు. దైవత్వానికి ఆరు లక్షణాలు ఉంటాయి ఐశ్వర్యం, (సర్వ వ్యాపకత్వం, సర్వజ్ఞత్వము, సర్వ సమృద్ధి) జ్ఞానం (నిరపేక్ష జ్ఞానం) ధర్మం (సమ న్యాయము) శ్రీ (వైభవము), యశస్సు (నశించని కీర్తి) వైరాగ్యం (వైరాగ్యము).

హిందూ సంస్కారములు ఆచారములు

ఏ మతానికయినా ఆచారములు సంస్కారాలు ముఖ్య లక్షణాలుగా ఉంటాయి .అవి మనసును ప్రక్షాళన చేస్తాయి. హృదయాన్ని పవిత్రం గావిస్తాయి ఆథ్యాత్మిక చింతన కలిగిస్తాయి.వాటిని తప్పక ఆచరించాలి.వాటిలో ప్రధానమైనవి-.

  1. జాతకర్మ మరియు అక్షరాభ్యాసం బాల్యంలో జరిగేవి
  2. ఉపనయనం: గాయత్రీ మంత్ర ఉపదేశం. గురూ పదేశం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది
  3. లగ్న సంస్కారం వివాహం: హిందువుల వివాహం అగ్ని సాక్షిగా జరుపబడుతుంది . వేదమంత్రాలు వరుడు వధువు యొక్క వివాహం జీవితానికి నాంది. దంపతులు కలిసి ఆధ్యాత్మిక జీవనం గడుపుతారు.

మరికొన్ని సంస్కారాలు ప్రతినిత్యం ఆచరించేవి అవి సంధ్యావందనం పంచ యజ్ఞాలు మొదలైనవి.

పంచమహా యజ్ఞాలు

మానవుడు సంఘజీవి. జీవనం గడపటం కోసం ప్రకృతిపై ఆధారపడతాడు.జన్మనిచ్చిన తల్లిదండ్రులు ద్వారా శరీరం వారి కానుకగా లభించింది. గాలి నీరు సూర్యరశ్మి ఆహారం మరి కొన్ని వేల అవసరాలు భగవంతుడిచ్చిన వరాలు. వీటిని ఇచ్చిన భగవంతునికీ మనిషికి కృతజ్ఞత చూపించాలి.తోటి ప్రాణుల పట్ల సానుభూతి కలిగి ఉండాలి.ఈ క్రింది పంచ మహా యజ్ఞాలు ఆచరించి భగవంతునికి కృతజ్ఞతలు సమర్పించాలి. అవి

  1. బ్రహ్మయజ్ఞం-రుషియజ్ఞం: గ్రంధాలు శాస్త్రాలు చదివి వాటిని ఆచరణలో పెట్టడం
  2. దేవా యజ్ఞం: ఇష్టదేవతా ప్రార్ధన పూజ
  3. పితృ యజ్ఞం: తల్లిదండ్రులను గౌరవించడం వారికి సేవ చేయటం పితృదేవతలను తలచుకొని పితృ తర్పణాలు చేయడం.
  4. భూతయజ్ఞం: జంతువులకు, పక్షులకు ఆహారం అందించడం.
  5. మనుష్య యజ్ఞం: అతిథులకు ఆతిధ్యం అవసరమైన వారికి సేవలు చేయడం.
పూజలు ఆరాధనలు

భగవంతునితో నిరంతరం ఆత్మ బంధమే పూజ లేదా ప్రార్థన. మొదట బహిరంగంగా దేవున్ని పూజిస్తారు.రాను రాను వారి మనసు లోనే ఉన్నాడని భావన తో నిరంతరం జపిస్తారు. తర్వాత సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఆరాధిస్తారు.సాధారణంగా దైవ పూజను విగ్రహారాధనను 16 విధాలుగా షోడశోపచార పూజ అని చేస్తారు. అవి

  1. ధ్యానం
  2. ఆవాహనం
  3. సింహాసనం
  4. పాద్యం
  5. అర్ఘ్యం
  6. స్నానం
  7. వస్త్రం
  8. యజ్ఞోపవీతం
  9. చందనం
  10. పుష్పం
  11. ధూపం
  12. దీపం
  13. నైవేద్యం
  14. తాంబూలం
  15. నీరాజనం
  16. సువర్ణ మంత్రపుష్పం

ఈ పూజల వల్ల మనం చూసే ప్రతి చూపు హృదయం భగవన్మయం అవుతుంది. ప్రేమ సేవలతో సర్వసృష్టికర్త భగవంతుని అన్నింటిలో లో దర్శిస్తారు.

సాధనా మార్గాలు

మోక్ష సాధనకు ఆచరించవలసిన సాధనా మార్గాలు

  1. కర్మ మార్గం: క్రియలో చేయవలసిన సాధనలు
  2. భక్తి మార్గం: ఆరాధనతో చేయవలసిన సాధనలు
  3. జ్ఞాన మార్గం: భగవంతుని తెలుసుకు నే విజ్ఞానం.
  4. ధ్యాన మార్గం: ఏకాగ్రత ధ్యానంతో చేసే సాధనలు
I. కర్మయోగం:

ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా కర్మలు ఆచరించడం కర్మయోగం. నిష్కామ కర్మవలన,మోక్షం కలుగుతుంది దీనివల్ల రక్షణ కలుగుతుంది.

II. భక్తియోగం

ఏ రూపమైన నామమైన భగవంతుని ఆరాధించడం భక్తియోగం నవవిధ భక్తి మార్గాలు బోధించారు. అవి తొమ్మిది భక్తి మార్గాలు

  1. శ్రవణం: భగవంతుని లీలా శ్రవణం, ఉదా: పరీక్షిత్
  2. కీర్తనం: భగవంతుని వైభవాన్ని ఆలపించుట, ఉదా: నారదుడు.
  3. విష్ణు స్మరణం: ప్రహ్లాదుని వలే నిత్యం స్మరించుట
  4. పాదసేవనం: లక్ష్మీ దేవి వలే స్వామి పాద సేవ. భగవానుని సృష్టి లో అందరిని భగవత్ స్వరూపులుగా భావించి సేవ చేయుట..
  5. అర్చనం: శ్రీ రాముని పాదుకలను భరతుడు పూజించినట్లు.
  6. వందనం: అక్క్రూరుని వలే నమస్కరించుట.
  7. దాస్యం: హనుమంతు ని వలే సేవ చేయుట. సాటి మానవులకు వినయం తో గౌరవం తో సేవ చేయుట.
  8. సఖ్యం: శ్రీ కృష్ణునికి అర్జునుని వలే స్నేహ భక్తి.
  9. ఆత్మనివేదనం: రాధ వలే ఆత్మ సమర్పణ చేయుట.

మరికొన్ని 5 భక్తి మార్గాలు గా బోధించారు అవి శాంత, వాత్సల్య, దాస్య, సఖ్య, మాధుర్య ఇవి భావ భక్తి మార్గాలు. భగవంతునితో అనుసంధానం కలిగిస్తాయి

III. జ్ఞానయోగం:

గ్రంధాలు, శాస్త్రాలు ‘తత్వమసి’ అని అది నీవే అయి ఉన్నావు. అని ఎరుక పరుస్తున్నాయి. అనగా నీవు భగవంతుడు అయి ఉన్నావు అని అర్థం
ఇవే నాలుగు మహా వాక్యాలు గా పేర్కొన్నారు.

  1. ప్రజ్ఞానం బ్రహ్మ: అత్యున్నత మైన జ్ఞానమే బ్రహ్మము.
  2. తత్వమసి: అది (భగవంతుడు) నీవే.
  3. అయమాత్మా బ్రహ్మ: నాలో ఉన్న ఆత్మ భగవంతుడు.
  4. అహం బ్రహ్మాస్మి: నేను భగవంతుడను.

పై వాటిలో మొదటి రెండు గురువు ఉపదేశాలు భగవంతునితో ఏకత్వాన్ని కలిగించేవి వాటిని ఆదేశాలు అంటారు మూడవది అభ్యాసం. నాలో ఉన్న ఆత్మ దేవుడు అని ఎరుక కలిగి ఉండటం. నాలుగవది అనుభవ వాక్యం. జ్ఞాన మార్గం తో నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడం.

యాజ్ఞవల్క మహర్షి తన భార్య మైత్రేయి తో ఈ మహా వాక్యాలతో సత్యాన్ని గుర్తించవచ్చని తెలిపాడు

  1. శ్రవణం: మహావాక్యాలను వినుట ద్వారా
  2. మననం: విన్నవాటిని మననం చేయుట
  3. నిధి ధ్యాస: ఏకీకృత మనస్సు తో అనుభవించుట.

మహర్షి చెప్పిన పై మూడు మన హృదయాన్ని ప్రక్షాళన కావించే సాధనలు. సాధనా చతుష్టయం ఇవి భగవంతుని ఎరుక పరుస్తాయి.

  1. వివేకం
  2. వైరాగ్యం
  3. షట్ సంపత్తి
  4. ముముక్షత్వం

ఈ సాధన మార్గాలు శారీరక,మానసిక, నైతిక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తాయి సనాతన ధర్మం మనకి సర్వాత్మ భావం,ఏకాత్మ భావం కలిగిస్తుంది
సమస్త లోకాః సుఖినోభవంతు అనే హిందూ మత ప్రార్థన తో పాటు సర్వేవైః సుఖినో స్సువంతు సర్వే సంతుః నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చత్ దుఃఖ మాప్నయాత్..ఇదే సర్వమత సమన్వయము.

సర్వమత సమానత్వాన్ని సమన్వయాన్ని కలిగించేది హిందూమతం.విశ్వశాంతి ని ప్రేమను పెంపొందిస్తుంది..హిందూ మత ప్రధాన సూత్రాలు

  1. భగవంతుడు అందరిలో ఆత్మ స్వరూపుడై ఉన్నాడు
  2. కర్మను అనుసరించే మన సుఖదుఃఖాలు ఆధారపడి ఉంటాయి
  3. మోక్షం సాధించేవరకు తిరిగి తిరిగి జన్మిస్తూ ఉంటారు
  4. ధర్మ రక్షణ కోసం మరల మరల భగవంతుడు అవతరిస్తాడు. ధర్మ మార్గాన్ని మానవులకు నిర్దేశిస్తాడు
  5. అన్ని మతాలు దేవుని చేరే మార్గాలు. మానవ జీవిత లక్ష్యం భగవంతుడిని తెలుసుకోవడం దాన్ని సాధించే మార్గం ధర్మ మార్గం అదే మతం యొక్క మార్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *