గుర్తింపు రైలు బండి
లక్ష్యము:
తీర్థ యాత్ర అనే ఈ ఆటలో పిల్లలు పవిత్ర క్షేత్రాలు, దేవతలను భక్తితో గౌరవంతో గుర్తు చేసుకుంటారు.
సంబంధిత విలువలు:
- ఊహా శక్తి
- ఏకాగ్రత
- జ్ఞాపక శక్తి
- భక్తి
- కుతూహలం
అవసరమైనవి:
ఏమీ లేవు
ముందస్తు తయారీ:
లేదు
ఎలా ఆడాలి
- పిల్లలను వృత్తాకారం లో కూర్చోమనాలి.
- ఒక ఉదాహరణతో గురువు ఆటను వివరిస్తారు.
- మొదట ఒక చిన్నారి “నేను పూరీ యాత్ర వెళ్లి జగన్నాధ స్వామి ని చూశాను” అని చెప్తాడు.
- ఇలా అందరూ ఒక్కో తీర్ధ స్థలము, అక్కడి దేవుని గురించి చెప్తారు.
- ఎవరైతే వారి యాత్ర గురించి గుర్తు పెట్టుకోలేరో, లేదా వేరే వాళ్ళు చెప్పిందే, మళ్ళీ చెపితే ఔట్ అయినట్టు.
గురువులకు సూచనలు:
- యత్రా స్థలాల గురించి చ ర్చించుకోవచ్చు. పిల్లలు చేసిన వివిధ యాత్రల అనుభవాలను కూడా పంచుకోవచ్చు.