గౌతమ బుద్ధుడు సన్యాసి, మత నాయకుడు మరియు బౌద్ధమత స్థాపకుడు. అతను శుద్ధోదన మహారాజుకు జన్మించాడు. ఒక రోజు, అతను తన రాజ్యంలోని ప్రజలు కష్టాలను అనుభవిస్తుండగా చూసి, జీవితంపై విరక్తి చెంది, సత్యాన్వేషణకై సన్యాసాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత బీహార్లోని బౌద్ధ్ గయలో బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడు.
ఆదిశంకరుని శిరస్సు, బుద్ధుని హృదయం, జనకమహారాజు చేతులు కలిగి ఉండాలని శ్రీ సత్యసాయి బాబావారు చెప్పారు. బుద్ధుని రూపనామము లందు కరుణ మరియు శాంతి భావాలు ప్రతిబింబిస్తాయి. ఎందుకనగా బుద్ధుడు ముఖ్యంగా తాను అనుసరించిన అహింస మార్గము, పవిత్రత మరియు త్యాగమే దీనికి ప్రధానమైన కారణాలు.
బుద్ధుని జీవిత చరిత్రను వివరించే ముందు విద్యార్థులకు బౌద్ధమతం గురించిన వివరణ ఇవ్వవచ్చు, ఇందులో సిద్ధార్థుడైన గౌతమ బుద్ధుని బాల్యము మరియు మోక్ష మార్గానికి బుద్ధుడు ప్రతిపాదించిన అష్టాంగ మార్గ సాధనలను (ఆత్మసాక్షాత్కారానికి) చేర్చవచ్చు.