ఆలోచన, శ్వాస మరియు సమయం యొక్క నిర్వహణ:
శాస్త్రవేత్తలు మెదడు యొక్క ఛాయాచిత్రాలను తీసి అందులో ప్రతి ఒక్కరికి 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసులో స్వభావము మరియు వ్యక్తిత్వ వైఖరులు ఏర్పడతాయని తెలిపారు. అదేవిధంగా భగవాన్ బాబా వారు బాలవికాస్ కూడా 6 నుండి 14 సంవత్సరముల వయస్సు కలవారికి సంబంధించినది అని చెప్పారు. విజ్ఞాన శాస్త్రము మెదడులోని ఆలోచనలు మరియు అధ్యయనాల వలయాలపై ఒక ఛాయాచిత్రాన్ని తీసింది. అది నాడీ కేంద్రం సందేశాన్నిచ్చే బిందువుల మధ్య వలయం ఉందని రుజువు చేసింది. కనుక మనం అలవాట్ల యందు, మన వ్యక్తిత్వ వైఖరి యందు ఎరుక కలిగి ఉంటాము. ఉదాహరణకు మీరు నన్ను కొట్టారనుకోండి నేను ఎలా స్పందిస్తాను? నేను తిరిగి కొట్టగలను లేదా మౌనంగా ఉండగలను. నేను ఒక పనినే ఎందుకు చేస్తాను? మరొక పనిని ఎందుకు చేయను? అన్నది ఆ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం మెదడు యొక్క స్థిర నిర్మాణంపై ఆధారపడి ఉంది. ఒకచోట స్విచ్ ను నొక్కితే మరొకచోట కాంతి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దానికి ఒక నిర్దిష్టమైన సర్క్యూట్ (కణజాల వల) ఏర్పరచబడింది. పిల్లలలి ఈ సర్క్యూట్ యొక్క స్థాపన 6 నుండి 15 సంవత్సరాల వయసు మధ్య జరుగుతుంది. మనము మంచితనము అనే వలయాన్ని, సమర్థత అనే వలయాన్ని, దివ్యత్వ పరిమళం అనే వలయాన్ని ఏర్పరచుకున్నామంటే, అప్పుడు మనకు మనమే రుణపడి ఉంటాము. మానవాళికి కూడా రుణపడి ఉంటాము. మరియు అన్నిటికంటే ఎక్కువగా
భగవంతుని దివ్య నామమునకు, అనుగ్రహానికి రుణపడి ఉంటాము. మనం చెప్పుకుంటున్న ఈ వయసు వారికి సరియైన మార్గదర్శకత్వాన్ని ఇస్తే, వారు దానినే అనుసరిస్తారు. మంచి అలవాట్లకు, సరియైన జీవన దృక్పథానికి గురి అవుతారు. ఫలితంగా ఈరోజు ప్రపంచానికి పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా మన ముందు ఉంటారు. పంజాబ్ లో జరిగిన తీవ్రవాదంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం చాలా నిరుత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకనగా హింసాత్మక తీవ్రవాదులు దాదాపు 15 నుండి 25 వయసు లోపల ఉన్నవారే. ఇలా ఎందుకు జరిగింది అంటే, వారికి తల్లిదండ్రులుగానీ, ఉపాధ్యాయులుగానీ, ఆధ్యాత్మిక సంస్థలలో గురువులుగానీ, ఆ పిల్లలకు వారి మానసిక సమతుల్యతను ఏర్పరచుకోవటానికి కావలసిన మార్గదర్శకాలను అందించటంలో విఫలమవటమే. ఈ వయసులో ఉడుకు రక్తం కలిగి ఉండటం సహజం. వారి ఆకాంక్షలు సరియైన దిశలో ఉన్నప్పటికీ తమని తాము తెలుసుకోలేకపోతున్నారు. తర్వాత జరిగే విపత్తుకు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సైన్సు అంతరిక్షాన్ని దాటి ముందుకు సాగిపోతోంది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నది.ఈ తరుణంలో మన బాలవికాస్ విద్యార్థులే ప్రత్యక్ష ఉదాహరణలుగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? వారి ప్రావీణ్యతలోనే కాదు, విద్యా నైపుణ్యంలోనూ కూడా. విద్యా నైపుణ్యంలో వారు రాణించకపోతే, మనం విఫలమైనట్టే. మన పిల్లలు బాల వికాస్, సాయి కళాశాలలో లేదా సాయి విశ్వవిద్యాలయములలో ఉన్నప్పటికీ, ఈరోజు ప్రపంచంలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. దానిని తట్టుకుని వారు ప్రతి ఒక్కరిని మించి పోవాలి. అది సాధించాలి. అది సాధించకపోతే ఆధ్యాత్మికత సాధనకు విలువ ఉండదు. ఈ విషయం శిక్షకుల శిక్షణా శిబిరంలో అంశంగా ఎందుకు వచ్చింది? అది ఎవరి కోసం ఉద్దేశించబడ్డది? పిల్లలు, శిక్షకులు, తల్లిదండ్రులు లేదా గురువుల కోసమా ?ముందుగా ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ విషయం కింద వర్గీకరించిన వ్యక్తుల కొరకై సూచించబడినది.
1.భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భక్తులందరికీ, బాబావారి దివ్యసందేశం గురించి సమగ్రమైన అవగాహన కొరకు. భగవాన్ బాబా భక్తునిగా మన పాత్ర మరియు మన బాధ్యత. ఈ విషయం మనందరికీ అన్వయిస్తుంది
2. సాయి సంస్థలలో భగవాన్ సందేశాన్ని అక్కడ ఉన్న వారికి, కొత్తగా వచ్చిన వారికి, స్వామి యొక్క దివ్యత్వాన్ని గురించి తెలియని వారికి పరిచయం చేయటం ఉత్తమమైన విషయం. మరియు ఇందులో ప్రధానంగా బాలవికాస్ పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకనగా బాలవికాస్ కేంద్రాలు చాలా పెద్ద సంఖ్యలో పిల్లలకు విలువలను చాటుతున్నాయి. వారి తల్లిదండ్రులకు బాబా గురించి తెలియడానికి అవకాశం లేదు. కనుక వారికి క్లుప్తంగా బాబా వారి జీవిత సందేశం ఏమిటి? వారి జీవనతత్వం ఏమిటి? ఇటువంటి ఆదర్శనీయమైన విషయాలు తెలియచేస్తే సరిపోతుంది?
3.ఇవన్నీచాలా సరళమైన విధంగా, అందరికీ అర్థం అయ్యే భాషలోనే మాట్లాడాలని బాబావారు తమ ఉపన్యాసాలలో పదేపదే తెలియజేశారు. మనకు అర్థం అయ్యే పదాలని ఉపయోగించాలి. అందరి ప్రశంసలు పొందే విధంగా వ్యక్తీకరించాలి. ఒకవేళ నేను సంస్కృతంలో ప్రసంగం చేసినట్లయితే, కొందరికి అర్థం అవుతుంది. మరికొందరికి అర్థం కాదు. మీకు మరియు నాకు ఇద్దరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితే బాగుంటుంది.సైన్స్ నుంచి తీసుకోబడిన దృష్టాంతాలు, ప్రస్తుత పరిస్థితుల నాధారంగా ఉదాహరణలు అన్ని జోడించి సందేశాన్ని అంతటా వ్యాప్తి చెందించుటకు మాకు మంచి అవకాశం ఉందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. భగవాన్ బాబాగారు 1950, 1960, 1975 మరియు 1986లలో చేసిన ఉపన్యాసాలను సమగ్రంగా పరిశీలిస్తే ఆయన ఇచ్చిన సందేశం ఒక్కటే అని తెలుస్తుంది. ఒక్క స్పష్టమైన తేడా ఉంది. అది ఏమనగా స్వామి చెప్పే ఉదాహరణలు ప్రస్తుత ప్రపంచ నేపథ్యం నుండి ఎక్కువగా తీసుకోబడ్డాయి. ఎందుకంటే అది మనం అర్థం చేసుకునే భాష. మనం వ్యక్తపరిచే పదజాలానికి అనుగుణంగానే సందేశానికి ప్రశంసలు పెరుగుతాయి. కాబట్టి ఈ విషయం యొక్క సంక్షిప్త నేపథ్యాన్ని అందించిన తర్వాత, బాలవికాస్ గురువులకు శిక్షకులుగా ఉన్న మనము మూడు వేరువేరు సామర్థ్యాలలో ఎందుకు సంభాషించాలో అర్థం చేసుకున్నాము.
4.మొదటిది సాయి భక్తునిగా మన పాత్ర , రెండవది శిక్షకుడిగా మన పాత్ర, మూడవది సాయి సంస్థలో బాధ్యతాయుతమైన సభ్యుడిగా మన పాత్ర, స్వామి తెలిపిన ఆదర్శాలను ఆచరించడంలో మరియు వాటిని సమాజానికి సులభతరంగా అందించడం ద్వారా అని.
భగవాన్ కి శ్రేష్టమైనది
ఎవరైనా నన్ను బాబా గురించి వివరించమంటే, బాబాగారు విశిష్టమైన లేదా శ్రేష్టమైన వ్యక్తిత్వం కల్గిన వారుగా వివరిస్తాను. స్వామి దృష్టిలో శ్రేష్టమైనది అనగా ఏమిటి? స్వామి చేసే పనులు, మాట్లాడటం, నడవటం, నా జీవితమే నా సందేశం అని చెబుతూ ఆయన ఏమి చేసినా సముచితమైనదిగా ఉత్తమమైనదిగా మరియు మెరుగైనది ఉండటమే శ్రేష్టమైనది అన్నదానికి నిర్వచనం.
మనకు శ్రేష్టమైనది అంటే:
వాస్తవానికి మనం చాలా విషయాలలో తప్పులను చేస్తాము. తరగతి సహచరులతో పోటీ తత్వంతో, పొరుగువారి యొక్క సమర్థతను, మన సమర్థతతో పోల్చటం మొదలగునవి. సమర్థత ఆంటే ఇతరులతో పోటీపడేది కాదని, మీతో మీరు పోటీ పడటం అని బాబా చెప్పారు. శ్రేష్టత అన్నది మనకే పోటీగా ఉన్నది. ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి నేను నా సమయాన్ని బాగా వృధా చేశాను. సమయం వృధా చేసిన యెడల జీవితం వృధా అవుతుంది.అందుకే సమర్థతకు మొదటి నిర్వచనం తనకు తాను పోటీగా ఉండటం.
అసాధారణమైన పనులు చేయటంలో సమర్థత ఉందని మనమందరము నమ్ముతాం. చాలా చక్కగా ప్రసంగాలు ఇవ్వడం, అందమైన పాట పాడటం అన్నది సమర్థత కాదు.
బాబా వారి ఉపన్యాసాలు చదివినట్లయితే అదే సమర్థత. అసాధారణమైన పనులు చేయటం సమర్థత కాదు, సాధారణమైన పనులను అసాధారణంగా చేయడమే సమర్థత అని తెలుసుకుంటాము. ఇదే విషయాన్ని వివేకానందుడు భిన్నంగా వివరించాడు.
“ఫుట్ లైట్ల వెలుగులో మీరు ఒక మూర్కుడిని వేదికపైకి ఎక్కించినట్లయితే, అతను సందర్భానికి అనుగుణంగా పైకి లేవవచ్చు కానీ, అ ఇది చాలా చిన్న విషయం. జీవితంలో ముఖ్యమైన విషయాలలో గొప్పతనం ప్రదర్శింపబడుతుంది.
త్రికరణ శుద్ధి పరిపూర్ణతను కలిగిస్తుంది. మనం (ఎలా మాట్లాడుతాము, ఎలా పని చేస్తాము, మనం ఎలా నడుచుకుంటాము) కానీ పరిపూర్ణత అన్నది చిన్న విషయం కాదు. మనం చిన్న విషయాలపై శ్రద్ధ వహిస్తే తప్ప పెద్ద పనులను చేయలేము. చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహిస్తే, పెద్ద విషయాలు వాటంతట అవే అయిపోతాయి.
బాలవికాస్ లో మనం పిల్లల మనసులో ఎన్నో పొందుపరచడానికి ప్రయత్నిస్తాము. ఉత్తమమైన మనస్సు- తనతో తాను పోటీపడటం మొ!!నవి. ఇది మనము వారిలో పొందుపరచక పోతే, బాలవికాస్ లో విజయం సాధించలేము. ఈ కారణంగా ప్రీసేవాదళ్ సభ్యుల యొక్క అపారమైన ప్రతిభను వెలికి తీయడంలో విఫలమయ్యాము. 15 సంవత్సరములు శిక్షణ పొందిన బాలవికాస్ విద్యార్థులు మరియు ఫ్రీ సేవాదళ్ సభ్యులు ఉన్నప్పటికీ ఎందువల్లనో మంచి పౌరులు లేదా సాయి సంస్థల యొక్క ప్రధాన విభాగంలో చేరిన వారు కానీ గణనీయమైన సంఖ్యలో ఎవ్వరూ లేరు.
ఆధ్యాత్మిక జీవనంలోనే కాకుండా ప్రాపంచిక జీవితంలో కూడా అభివృద్ధి చెందాలనే తపన, సమర్థత మనం వారిలో నింపలేదు. భగవాన్ సందేశాన్ని అనుసరించడం ద్వారానే వారు ఉన్నతమైన మార్గంలో పయనించగలరని వారు గ్రహిస్తారు. సమర్థత అనేది ఒక పనిని 100% మెరుగ్గా చేయడం మాత్రమే కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మంచి కళాకారులు కావచ్చు లేదా మంచి శాస్త్రవేత్త కావచ్చు లేదా మంచి దుస్తులు తయారు చేసే దర్జీ కావచ్చు. సమర్థత అంటే 1000 పనులనైనా నూటికి నూరు శాతం మెరుగ్గా చేయడం.
మనం చేసే పనిలో గుణాత్మకమైన మెరుగుదల ఉండాలి అనేది ప్రపంచమంతా ఉద్యమంలా సాగుతుంది. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తనకు తెలియకుండానే ఈ శ్రేష్టమైన మార్గంలో పోరాడుతూ, విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ విజయాన్ని కోరుకుంటారు, ఆనందాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు విజయం యొక్క రహస్యము, ఆనందం యొక్క రహస్యం ఏమిటి?
విజయము మరియు ఆనందం యొక్క రహస్యం ఏమిటంటే, ఇతరులు మనం ఈ పనిని చేయలేము అని భావించినప్పుడు, మనం దానిని సాధించినచో మరియు మనం చేయలేము అని మనం అనుకున్నప్పుడు అది సాధించడంలోనే ఉన్నది. ఎందుకంటే భగవంతుని అనుగ్రహం ద్వారానే మనము ఏదైనా సాధించగలము.
బాబా చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు.
మద్రాసు మరియు బెంగళూరు మధ్యన వున్న ఎయిర్ డిస్టెన్స్ లో నూట యాభై నిమిషాలలో కాకి ఎగరగలదు. ఇది మన అందరికీ 150 మైళ్ళు. ఇప్పటికీ విమానం 40 నిమిషాల్లో చేరుకుంటుంది. కొన్ని రోజులు 30 నిమిషాలలో, మరికొన్ని రోజుల్లో ఒక గంటలో చేరుకుంటుంది. దూరం ఒకటే కానీ సమయం లో తేడా ఉన్నది ఎందుకు? ఒక్కోసారి గాలి అనుకూలమైన విధంగా ఉండి సహాయపడుతుంది. కొన్నిసార్లు గాలి ప్రతికూలంగా ఉండి వ్యతిరేకిస్తుంది. “భగవంతుని అనుగ్రహం అనుకూలమైన గాలి లాంటిది” అని భగవాన్ బాబా గారు చెప్పారు. ఆ దూరం ఒకటే అయినప్పటికీ మనం చేరగలిగే సమయం తక్కువ అవుతుంది. “మనం ఈ మూడు విషయాలు లేకుండా జీవించటం సాధ్యం కాదు” అని స్వామి మానవ శరీరం గురించి చెప్తున్నారు. నేను చొక్కా, గడియారం, కారు సంపద, కొన్ని మిలియన్ల వస్తువులు లేకుండా జీవించగలను. కానీ నేను లేకుండా జీవించలేని మూడు విషయంలో ఏమనగా- “ఆలోచన, శ్వాస మరియు సమయము”.
1. నేను శ్వాస లేకుండా జీవించలేను. కొద్దిసేపు శ్వాస ఆగిపోతే, శ్వాసక్రియలోని ఆక్సిజన్ ప్రవాహం ఆగిపోయి నా జీవితం అంతం అవుతుందని శాస్త్రం చెబుతుంది.
2. నేను ఊపిరి పీల్చుకున్నంత కాలం నా మెదడులోని ఆలోచనలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఆలోచనలు లేకుండా ఏ మానవుడు జీవించలేదు. శ్వాస ప్రక్రియ అనేది మెదడు యొక్క అసంకల్పిత నియంత్రణ . మెదడు వ్యవస్థకు గాయం అయితే మన ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయని మనందరికీ తెలుసు. మెదడు దెబ్బ తింటుంది కానీ ఊపిరితిత్తులు కాదు. ఎందుకనగా మెదడు నుండి ఆదేశాలు వస్తేనే గుండె కొట్టుకోవడం మరియు ఊపిరితిత్తులకు శ్వాస అందడం జరుగుతుంది.
3. మనం జీవించడానికి అవసరమైన మూడో విషయం ఏమనగా అది మన ఉనికిని చూపే కాలము.
ఈ మూడు ప్రతి మనిషికి అందుబాటులో ఉన్న జీవితంలోని ప్రాథమిక సూత్రములు. నా దగ్గర డబ్బు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, నా దగ్గర సంపద ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, నా వద్ద తెలివితేటలు, నైపుణ్యము ఉండొచ్చు లేదా లేకపోవచ్చు కానీ నాకు ఎల్లప్పుడూ మూడు విషయాలు ఉంటాయి. నాకు నా ఆలోచన ఉంది. నాకు నా శ్వాస ఉంది నాకు నా సమయం ఉంది. బాబా చాలా సరళంగా చెప్పారు – వీటిలో ప్రతి ఒక్కటి వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు మరియు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకోవచ్చు.
నేను ఆలోచనను ఒక విధంగా ఉపయోగించగలను మరియు మీరు దానిని మరొక విధంగా ఉపయోగించుకొనగలరు. అలాగే శ్వాస మరియు సమయం కూడా అలాగే ఉంటుంది అందువలన మన జీవితంలో సమర్థత యొక్క అవుట్ పుట్స్ కావాలంటే జీవితంలో విజయము, ఆనందము, సంతృప్తిని లక్ష్యంగా చేసుకోవాలి. మా ఇన్పుట్స్ ఆలోచన, శ్వాస మరియు సమయం యొక్క నిర్వహణ.
ఆలోచన యొక్క నిర్వహణ, శ్వాస యొక్క నిర్వహణ మరియు సమయం యొక్క నిర్వహణ. నిర్వహణ అనగా నిర్వచనం ఏమిటంటే నిర్వహణ అనేది మనల్ని మనం ఉద్ధరించుకునే కళ.
ఉద్ధరణ అంటే విభిన్న అవకాశాలు కలిగినప్పుడు వాటిని ఉత్తమ ప్రయోజనాలను పొందే విధంగా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉపయోగించడం అని అర్థం. ఈ విధంగా వనరులను ఉద్ధరించుకోవడం చాలా తక్కువ. సమయము, శ్వాస, ఆలోచనలు చాలా తక్కువ. ఈ విషయంలో అత్యుత్తమైన ఫలితాలను మీరు చేరుకునే విధంగా ఈ కొరత వనరులను ఉద్ధరించటం. అందువలన మన సమయము, శ్వాస మరియు ఆలోచనలను నియంత్రించవలసిన అవసరం మనకు ఉంది. ఈ మూడింటిని నియంత్రించ గలిగినప్పుడే అది మనకు అత్యున్నతమైన స్థాయి అని భగవాన్ బాబా వారు చెప్పారు.
(మూలం: ది పాత్ డివైన్, శ్రీ సత్యసాయి బాలవికాస్, ధర్మక్షేత్ర, ముంబై)