సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు మానవతా విలువలు మానవులలో సహజ సిద్ధంగానే ఉంటాయి. స్వామి వాటి ఆచరణ గురించి మరియు హృదయంలో నున్న వాటి వ్యక్తీకరణ గురించి పదే పదే నొక్కిచెప్పారు. అంతేకాక ఈ ఐదు మానవతా విలువలను ఆచరించే క్రమంలో మొదట మానవునిలో వున్న ఆరు శత్రువులయిన (అరిషడ్వర్గాలు) కామ, క్రోధ, లోభ, మోహా, మద, మత్సరములను తొలగించాలి. మద, మాత్సరాలు మనలోని ఈ ఐదు విలువలను మింగివేస్తాయి. వీటిని తొలగించుటకై ప్రధానంగా మనపై మనకు ఆత్మవిశ్వాసము మరియు దేవునిపై దృఢతరమైన విశ్వాసము వుండాలి. ఆత్మవిశ్వాసమే మన జీవితానికి పునాది. ఒకసారి పునాది పటిష్టమైన తర్వాతనే మనం ఆత్మ సంతృప్తి మరియు ఆత్మత్యాగం కోసం ప్రయత్నించాలి.
ఈ రెండింటి ప్రయత్నమే చివరకు ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది.
ఈ షడ్రిపుల విభాగంలోని కథలను విద్యార్థులకు వివరించడంతోపాటు విద్యార్థుల నిత్యజీవితంలోని అనువైన ఉదాహరణలను కూడా వివరించవచ్చు. విద్యార్థులు తమ జీవితంలో ఈ ఐదు మానవతా విలువలలో ఏదైనా ఒకదాన్ని ఆచరించిన సందర్భాలను కూడా వివరించవచ్చు.