అంతర్గత మార్పు కోసం ఒక అంతర్ముఖ ప్రయాణం
మనం ఏదైనా విషయాన్ని బాహ్య ప్రపంచం నుండి స్థిత ప్రజ్ఞత తో గ్రహించి, సంభాషించే ప్రక్రియే పరివర్తన. ఉదాహరణకు, మనమందరం ఈ ప్రకృతి, భౌతిక ప్రపంచంలో టీవీ వంటి ప్రసార సాధనాలతో బంధింపబడి ఉన్నాం (ప్రోగ్రాం చేయబడి ఉన్నాం).
మన మనస్సులో కలిగే ఆలోచనలను ఎల్లప్పుడూ ప్రేమతో నింపినపుడు మనం చూసేవి వినేవి అన్నీసత్యమైనవిగా, మంచివిగాను గోచరిస్తాయి.
ప్రతికూలతతో నిండిన మన మనసులను సానుకూలత తో ప్రత్యామ్నాయం చేయాలి. అలాంటి పునర్వ్యవస్థీకరణ ప్రారంభించడం కష్టం. మనస్సు ఇప్పటికే ఉపచేతనలో ఉన్నదానిని మరింత బలపరచడానికి పనిచేస్తుంది. మన అనుభవానికి విరుద్ధంగా ఉన్న దానిని తిరస్కరించడానికి మనస్సు ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ప్రస్తుత ప్రవర్తనా నమూనాలను మార్చగల ఉత్పాదకాలను మనస్సు సాధారణంగా తిరస్కరించే విధంగా ఉంటుంది.
కానీ, మనం కోరుకొనే పరివర్తనకు పునః రూపకరణ అవసరం. అయితే, యూ-టర్న్ తీసుకోవడం ఎలా? మూలానికి తిరుగు ప్రయాణం ఎక్కడినుంచి ప్రారంభించాలి. మరి ఈ మార్పు ప్రక్రియను ఎలా ప్రారంభించాలి? మార్పు ప్రక్రియ నిగూఢమైన సూక్ష్మ మరియు సంక్లిష్ఠమైన ఐదు “డి” లు (Five D’s) – Devotion (భక్తి), Discrimination (వివేచన), Determination (ధృడసంకల్పం), Discipline (నియమం), మరియు Duty (విధి) – యొక్క కలయిక ద్వారా సాధించబడుతుంది.
మనము సచేతనంగా అంతర్గత ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, శ్వాస తీసుకోవడం మరియు వదలడం ప్రక్రియ ద్వారా వాయువు అంశం తక్షణమే మనకు తెలుస్తుంది. శ్వాస యొక్క లయ, వేగం మరియు లోతును గమనించడం ఎంత ముఖ్యమో కూడా మనకు తెలుసుతుంది.
మనకు క్రమశిక్షణతో కూడిన లయ మరియు లోతైన శ్వాస నియంత్రణ పొందాలంటే ఎంతో శిక్షణ అవసరం. ఈ ప్రక్రియలో సామూహిక భక్తి గానం మరియు ప్రార్థనలు అనే రెండు పద్ధతులు ఈ మార్పునకు ఎంతో దోహదపడతాయి. “సో హమ్” మంత్రం మరొక శక్తివంతమైన అభ్యాస ప్రక్రియ, మనలను మన లక్ష్యానికి మరింత చేరువ చేస్తుంది.
మనిషి 24 గంటల్లో రోజుకు 21,600 సార్లు గాలిని పీలుస్తాడు మరియు వదులుతున్నాడు. పీల్చేటప్పుడు “సో” అనే శబ్దం వినిపిస్తుంది; వదిలేటప్పుడు “హమ్” అనే శబ్దం ప్రకటితమౌతుంది. ఇవి కలిసి “సో-హమ్” అనే పదాన్ని తయారు చేస్తాయి, దాని అర్ధం “అతడే నేను” అని, ఇది మనిషి యొక్క అంతరంగిక దైవత్వాన్ని ప్రకటిస్తుంది. –
– శ్రీ సత్య సాయి
మార్పు అవసరాన్ని తెలుసుకోవడం మొదటి దశ. ఈ మార్పు పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం ప్రధాన అవసరం. దైవత్వంతో గల మన మూల సంబంధాన్ని పునరావిష్కరించడం చాలా ముఖ్యం. మనం దైవత్వానికి ప్రతిరూపం అని మనస్సుపై గట్టిగా ముద్రించబడినప్పుడు, మనం మూలాన్ని తిరిగి కనుగొనవచ్చు. ఈ విధంగా, మనము ఆలోచనల దుష్టచక్రం నుండి వేరుపడి, శరీర-మనస్సు తత్వానికి మాత్రమే పరిమితం కాకుండా, భక్తితో, మన క్రియాస్థాయిని, సత్యాన్ని మహోన్నత స్థాయికి చేర్చే ప్రయత్నం చేయాలి.
ముందుగా మనలను మన ప్రభువు చెంతకు తీసుకువచ్చినది ఈ విశ్వాసమే. తన అపారమైన కృపతో, భగవాన్ బాబా మనకు గొప్ప మార్గాన్ని చూపించారు. ఉద్దేశపూర్వకంగా మనం మొదటి అడుగు తీసుకోవాలి, తరువాతి పది అడుగులు సహజంగా అనుసరిస్తాయని బాబా హామీ ఇస్తున్నారు. మార్పు ప్రక్రియ కారణ మరియు పరిణామాల క్రమాన్ని అనుసరిస్తుంది. మనం ఏది నాటితే, నిర్ణీత సమయంలో అది సమృద్ధిగా పెరుగుతుంది. మనం ఏది నాటితే, అది పెరుగుతుంది. కాబట్టి, మనస్సు యొక్క సారవంతమైన తోటలో మంచి ఆలోచనలు నాటాలి. మంచి పుస్తకాలు చదవడం, మంచి స్నేహితుల సహవాసం మరియు మంచి పరిసరాలు ఈ మార్గంలో కొనసాగడానికి చాలా అవసరం.
మనస్సులో మంచి ఆలోచనలు అనే గులక రాళ్ళను వేసినప్పుడు, వాటి నుంచి ఉద్భవించే అలలు అన్ని ఇంద్రియాలను చేరుకొని మంచి మాటలు, మంచి దృశ్యాలు, మంచి చర్యలు, మరియు మంచి వినికిడి గా మారుతాయి. –
– శ్రీ సత్యసాయి (21 మే 2000)
మనసు పవిత్రతను సాధించడానికి మాకు ప్రేరణ ఇచ్చేది విశ్వాసమే. ఇంద్రియాల ద్వారా మనం చేసే సానుకూల చర్యలు, అసంకల్పితంగా క్రమంగా మనస్సు సానుకూల భావాలతో నిండుతుంది. ఈ ప్రక్రియ, మురికి నీటితో నిండిన ఒక గ్లాసును తీసుకొని, శుభ్రమైన నీటిని ఇస్తున్న కొళాయి క్రింద పెట్టినట్లే ఉంటుంది. క్రమంగా చివరకు, మురికి నీరు ఉన్న గ్లాసు శుభ్రమైన నీటితో భర్తీ అవుతుంది. అప్పుడు, మంచి ప్రవర్తన మన ప్రయత్నం లేకుండానే వస్తుంది; తద్వారా అది మన స్వభావం అవుతుంది.
అదేవిధంగా, ఇంద్రియాల ద్వారా తగిన ఆలోచనలు ఎంచుకోవడంలో వివేకాన్ని ఉపయోగించాలి. ఈ ప్రక్రియలో, మన కోరికలపై నియంత్రణ ఉంచాలి.
“గ్రహణ శక్తికి కారణమైన ఐదు ఇంద్రియాలలో, కళ్ళు అపారమైన శక్తితో అనుగ్రహించబడ్డాయి. మనిషి జీవిత కాలం అతని అపవిత్రమైన దృష్టి వల్ల తగ్గిపోతుంది. దృష్టిని నియంత్రించడం తో పాటు, మనం మన నాలుకపైన కూడా నియంత్రణ కలిగి ఉండాలి. మనిషి తాను తినే రుచులకు బానిసవుతాడు. అతను తన నాలుకను అపవిత్రమైన మాటలు చెప్పేలా చేస్తాడు మరియు కఠినమైన మాటలు వాడడం ద్వారా ఇతరుల భావాలను నొప్పిస్తాడు.”
– శ్రీ సత్యసాయి (5 జూలై 2001).
మనకు దృఢ సంకల్పం లేకపోతే జీవితంలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు. మార్పు యొక్క అవసరం పై అవగాహన స్థాయి సరైన ఉన్నతిమట్టానికి చేరినప్పుడు సంకల్పశక్తి క్రియాశీలం అవుతుంది. అర్థవంతమైన చర్యలు సాధన చేయాలి; అందువల్ల, “మంచి చూడటం, మంచిగా ఉండటం, మంచి చేయడం” కోసం ఆత్మ నియంత్రణ అవసరం. మనస్సుకు స్వీయ నియంత్రణ సాధన పై శిక్షణ ఇవ్వడానికి మరియు అభివృద్ధి చేయడానికి, గొప్ప శ్రద్ధ అవసరం. మనము ప్రధానమైన వివేచన చర్యలను స్థిరమైన చర్యలుగా మార్చుకోవాలి; మనం అనిచ్ఛాపూర్వకంగా మంచి స్వభావం అలవాటు చేసుకోవాలి.
కాలక్రమేణా, మానవతా విలువలు చైతన్య మరియు అవచేతన స్థితిలో మనసులో ఏర్పడతాయి. ఈ విధంగా, మనస్సులో ఓ నిశ్శబ్దం ఏర్పడి, అంతరాత్మ యొక్క స్వరము గట్టిగా మరియు స్పష్టంగా వినిపిస్తుంది. తద్వారా ఉన్నతమైన ఆత్మ, అంతఃకరణ ఒక చైతన్య మనసుకు నిశ్చితమైన తీర్పరిగా మారతాయి. మనస్సు పవిత్రత సాధించినప్పుడు, మన ఆలోచన, మాట మరియు చర్యల లో ఏకత్వం ఉంటుంది.
‘భగవంతుని ద్వారా మనం పొందిన, వివిధ సామర్ధ్యాలతో కూడిన ఈ శరీరం, మనకు ప్రసాదించిన మేధస్సు, అనేక ప్రకృతి సిద్ధ సౌకర్యాలైన గాలి, నీరు మరియు సూర్యకాంతులను అనుగ్రహించినందుకు వ్యక్తం చేసే కృతజ్ఞతే నిజమైన భక్తి –
– శ్రీ సత్య సాయి (6 మార్చి 1987).
మనుషులు ఎక్కడ ఉన్నా సమానమే. బాలవికాస్ లో ఉన్న పిల్లలు కానీ, పాఠశాలలో ఉన్న విద్యార్థులు కానీ, యువకులు కానీ, వయోజనులు కానీ, భారతదేశపు పౌరులు కానీ, విదేశాలలోని పౌరులు కానీ, సత్యసాయి ఎడ్యుకేర్ యొక్క లక్ష్యం ఒకటే. ప్రపంచంలోని ఎక్కడైనా నాటి వేసిన మామిడి గింజ మామిడి చెట్టుగా పెరిగి మామిడి పండ్లనే ఇస్తుంది; పర్యావరణ కారణాలు పండ్ల పరిపక్వత లేదా పరిపూర్ణతను మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఇలాంటి విధంగానే, సత్యసాయి ఎడ్యుకేర్ లో ఉపయోగించే పరివర్తన పద్ధతులు ఒకటే. సామాజిక, సాంస్కృతిక సందర్భాలు విషయాలలో మరియు శిశువుల నుండి యువకుల వరకు, వయోజనుల వరకు వాటిని ఉపగమించే విధానం లో మార్పులు అవసరపడవచ్చు. ఉదాహరణలు వేరుగా ఉండవచ్చు; అయితే, తుది ఫలితం ఎల్లప్పుడూ ఒకటే ఉంటుంది. సత్య సాయి ఎడ్యుకేర్ విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది. ఇది అన్ని విధములైన ఆధ్యాత్మిక జ్ఞానానికి పరమార్థం మరియు, 21వ శతాబ్దపు వేదాలు.
Duty, loving service to God, is the body’s prayer to the Divine. The human body is the mind’s instrument of action in the world. It has evolved out of the five elements; it must serve the mind to purify and keep the world in a state of balance. That is the body’s purpose and duty. By selflessly engaging ourselves in service activities, Seva, we are able to transcend the false sense of identifying ourselves with this body alone.
Thus, we initiate an inner journey and become conscious of the Divine Centre within. With an increasing turn to the inner spirit, we begin to share our Love and Peace with everyone.
This Love is capable of producing strong global vibrations to energise the whole world. Thus, we begin to climb an ascending scale of our spiritual evolution; and our will merges with Divine Will.
‘When transformation is gained, you will find that you have travelled only from yourself to yourself, with God all the while in you, around you, with you and beside you.’
– Sri Sathya Sai
Mankind is the same everywhere. Whether a child in Bal Vikas or a pupil in school, whether a youth or an adult, whether a citizen of India or of an Overseas country, the goal of Sathya Sai Educare is identical. A mango seed planted anywhere in the world will grow into a mango tree and yield only mangoes; environmental factors may only affect the ripeness or fullness of the fruits. In a similar manner, the transformation techniques employed in Sathya Sai Educare remain the same. Social and cultural contexts may require changes in the content, the approach may have to be modified from infants to youths to adults, the examples cited may be different; however, the end product shall always be the same. Sathya Sai Educare is applicable universally. It is the summum bonum of all spiritual knowledge, the Vedas of the 21st century.
- మార్పు అనేది మూలానికి తిరిగి వెళ్లే పయనం
- పరివర్తన ప్రక్రియ ప్రారంభం విశ్వాసంతో జరుగుతుంది.
- మార్పు ప్రక్రియ కోసం అభివృద్ధి చేయాల్సిన ఐదు వనరులు: భక్తి, కర్తవ్యం, క్రమశిక్షణ, వివేచన మరియు దృఢ సంకల్పం.
- మార్పు ప్రక్రియ కోసం ఉపయోగించాల్సిన ఐదు పద్ధతులు: ప్రార్థనలు, భజనలు, నిస్వార్థ సేవ, అంతర్గత సమన్వయం మరియు మంచిా పరిసరాలు.