సెమిటిక్ మతములు
జూడో క్రైస్తవ ఇస్లాం మతాలు సెమిటిక్ మతములు. షెమ్ పరంపర ప్రజలందరినీ సెమిటిక్ అనేవారు.షెమ్ నోహ్ కుమారుడు. అన్ని మతాలు భగవంతుడు ప్రవక్త ద్వారానే సందేశాలు అందిస్తాడని నమ్ముతాయి. జోడో సెమిటిక్ మతాలకు తల్లి వంటిది. దాని నుంచి వచ్చిన కుమార్తెల వంటివి క్రైస్తవ మతం,అనంతరం ఇస్లాం మతం.
జూడో మత ప్రవక్త మోజెస్ పది సూత్రాల ప్రణాళికను బోధించాడు. జోహోవా అనే దేవుడి సందేశంగా దాన్ని భావిస్తారు తర్వాత కాలంలో హెబ్రోన్ భాషలో ఉన్న వాటి అంతర్గత ప్రాముఖ్యతను మరిచి బహిరంగ ఉత్సవాలకు పర్వదినాలకు ప్రాధాన్యతనిచ్చారు. తదనంతరం వాటి ప్రాముఖ్యతను గుర్తించి జీసస్ భగవంతుని ఆదేశ సూత్రం ప్రేమ, అని బోధించాడు. మానవత్వంతో పవిత్రత తో జీవించాలని బోధ చేశారు. పాత పది సూత్రాలు జీసస్ వెలికి తీసినా, జూడో మతం మోజస్ ప్రభావంతో వాటిని అంగీకరించలేదు.ఆ కారణంతో మరో కొత్త మతంగా క్రైస్తవ మతం ఆవిర్భవించింది. తర్వాత కాలంలో అది ప్రపంచంలోనే పెద్ద మతం గా నెలకొన్నది.
ఏడవ శతాబ్దంలో అరేబియా ప్రజలు మూఢనమ్మకాలతో చిన్న చిన్న సమూహాలుగా మారి ఒకరితో ఒకరు యుద్ధాలు చేసేవారు. ఎవరి నమ్మకాలు ఆరాధనలు వారివి. భిన్న జాతులుగా మారారు ఆ సమయంలో మహమ్మద్ ప్రవక్త తానే గొప్ప క్రైస్తవునిగా బోధనలు చేశారు.ఆయన ప్రభావంతో మరో కొత్త మతం పుట్టుకొచ్చింది.అదే ఇస్లాం మతం. ఈ మూడు మతాల బోధనల సారం ఒకటే అదే దైవ పితృత్వం,మానవ సోదరత్వం.