యేసు క్రీస్తు ఒక మత నాయకుడు మరియు క్రైస్తవ మత స్థాపకుడు. అతను అనేకసార్లు తాను దేవుని దూతను అని, దేవుని కుమారుడను అని, నేను నా తండ్రి ఒక్కటే అని ప్రకటించాడు.
ప్రజలందరిలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వం గురించి అవగాహన కలిగించడానికి యేసు మానవ జన్మను ధరించాడు. అతని ప్రధాన బోధన ఏమనగా భగవంతుని యందు మరియు ఇతరుల యందు కల ప్రేమను వ్యాప్తి చేయటం.
యేసు సరళమైన, ఆచరణాత్మకమైన బోధనలను అందించాడని మరియు తాను అనుసరించే ప్రేమ,కరుణ వంటి దైవిక లక్షణాలను మనం ఎలా పొందించుకోవచ్చో చూపించారని స్వామి చెప్పారు. యేసు నిరుపేద లకు సేవ చేసాడు. ఎప్పుడైతే మనము పేదలకు, అవసరమైన వారికి, ఆకలితో ఉన్నవారికి మరియు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తామో, అది భగవంతునికే చేస్తున్నామని భావించాలని తన అనుచరులకు బోధించేవాడు, అంతేకాక భగవంతుని యొక్క దివ్య ప్రేమ తత్వాన్ని కూడా బోధించేవాడు.
యేసు జననము మరియు అతని జీవిత గాధలను తరగతిలో ఉపాధ్యాయుడు వివరించవచ్చు. వాటిని క్రిస్మస్ సమయంలో సిలబస్లో భాగంగా పూర్తి చేయవచ్చు మరియు క్రిస్మస్ కార్యకలాపాలలో ప్రణాళికగా ఏర్పరచుకోవచ్చు.