5 Ds- పరివర్తనకు అంతర్ముఖ ప్రయాణము
బాహ్య ప్రపంచముతో సంబంధ బాంధవ్యములు నిర్వహించే క్రమములో, బాహ్య ప్రపంచము గురించి సమగ్రమైన అవగాహన పొందే ప్రక్రియలో మార్పు/ పరివర్తన అనేది ఒక నిర్దిష్టమైన పద్ధతి. మన మనస్సులో ఆవిర్భవించు అనేక తలంపులలో అంతర్లీనముగా ప్రేమను విస్తరింప చేసినప్పుడు /నింపినప్పుడు, మన దృష్టి, వాక్కు, శ్రవణము అంతయు కూడా మంచిగా రూపాంతరము సంతరించుకుంటాయి.
ఉదాహరణకు మనము మన చుట్టూ ఉన్నటువంటి స్థితిగతుల, గత అనుభవాలు, టీవీ, మీడియా యొక్క ప్రభావమునకు లోబడి ఉన్నాము. వీటిచే ప్రభావితమై ఉన్నాము. మన మనస్సులో నిండి ఉన్నటువంటి నెగెటివిటీని తీసివేసి దాని స్థానంలో నెగిటివిటీకి ప్రత్యామ్నాయంగా పాజిటివిటీని నింపాలి. ఆ విధముగా తిరిగి మనలను మనము మలుచుకోవాలి అంటే చాలా కష్టతరమైన పని. సబ్కాన్షియస్ మైండ్ లో (ఉపచేతనావస్థ) నిక్షిప్తమైనటువంటి భావములు, ఆలోచనలు యొక్క ప్రభావము వర్తమాన నడవడికపై ఎంతైనా ఉంటుంది. వాటి యొక్క పట్టు ఉంటుంది. గత అనుభవమునకు విరుద్ధముగా ఉన్నటువంటి దేనినీ అంగీకరించలేము. మన ప్రవర్తనలో మార్పును సూచించు, పరివర్తనకు దారి తీయు అంశములను, పద్ధతులను, నియమావళిని మనస్సు ప్రతిఘటిస్తుంది/ నిరోధించడానికి ప్రయత్నిస్తుంది.
మనము మనలో మార్పు/ పరివర్తన కలగాలి అని కోరుకున్నట్లైతే మనల్ని మనము తిరిగి మలుచుకోవాలి/ తీర్చిదిద్దుకోవాలి. ప్రాథమిక దశ నుండి మనలను తీర్చిదిద్దుకోవటానికి వెనుకకు మరలాలి అంటే ఆ మలుపు ఎక్కడ తీసుకోవాలి? మన పునరుద్ధరణ ప్రక్రియ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? తరచి చూచిన ఐదు అబ్యాసములు/ డకార పంచకములు -భక్తి, నియమబద్ధత,కర్తవ్యము, విచక్షణ,దృఢ సంకల్పము అనే సూక్ష్మమైన, సంక్లిష్టమైన సాధనలను వినియోగించుకుని ఈ మార్పు/ పరివర్తన అను దానిని సాధించవచ్చును.
మన ప్రయాణము అంతర్ముఖము గావించినప్పుడు మనము జరుపునటువంటి /సలుపునటువంటి శ్వాస ప్రక్రియ ద్వారా పంచభూత తత్వమైన వాయువు/ గాలి గురించి తెలుసుకుంటాము / అనుభవములోనికి వస్తాము.
క్రమ పద్ధతిలో, ఒక తీరుగా, లయబద్దంగా జరిగేటటువంటి శ్వాస ప్రక్రియ, ఈ లక్షణముల విశిష్టతను మనకు అవగాహనలోకి తెస్తుంది. నియమబద్ధమైన, దీర్ఘమైన, లయబద్దమైన, క్రమబద్ధమైన శ్వాస ప్రక్రియను జరుపవలెనన్న కొంత శిక్షణ అవసరము. భక్తి సంబంధమైన బృందగానము, ప్రార్థన అను ఈ రెండు విధములు మనకు ఈ శిక్షణలో సహాయపడతాయి. ఈ లక్ష్యసాధనలో “సో- హమ్” మంత్ర అభ్యాసము మరియొక శక్తివంతమైన సాధనము.
ప్రతిక్షణం మనము శ్వాసక్రియను సలుపుతూనే ఉంటాము. మనకు ప్రాణాధారము గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్. మానవుడు ప్రతి దినము 21,600 పర్యాయములు ఉచ్ఛ్వాసనిశ్వాసములను జరుపుతూ ఉంటాడు. శ్వాస లోనికి తీసుకునేటప్పుడు “సో” అనేటువంటి శబ్దము సంభవిస్తుంది. గాలిని వదిలేటప్పుడు “హమ్” అనేటువంటి శబ్దం వస్తుంది. ఉఛ్వాస నిశ్వాసములు రెండు కూడాను “సో- హమ్” అనే పరమార్థమును బోధిస్తాయి అనగా “అదే నేను”, “నేనే దైవము”, మానవులో ఉన్నటువంటి సక్రమమైన దైవత్వమును ఉచ్చరిస్తూ/ ప్రకటిస్తూ ఉంటున్నాయి.
– శ్రీ సత్య సాయి
మనకు మార్పు అవసరము/ మనలో పరివర్తన కావాలి అని తెలుసుకోవటమే, ఆ లక్ష్యసాధనలో ప్రథమ సోపానము. ఈ క్రమములో కీలకముగా అవసరమైనది, ఈ యొక్క పరివర్తన ప్రక్రియలో అచంచలమైన విశ్వాసము కలిగి ఉండుట. దైవముతో, దివ్యత్వంతో మనకున్నటువంటి అవినాభావ సంబంధమును తెలుసుకొనుట చాలా ముఖ్యము. దైవము యొక్క, దివ్యత్వము యొక్క ప్రతిబింబముగా మనలను తెలుసుకున్నప్పుడు, రూఢీగా నిశ్చయముగా భావించినప్పుడు మన యొక్క జీవిత లక్ష్యమును, మూలమును తెలుసుకోగలిగినవారమవుతాము. నెగెటివిటీ అనేటువంటి విషవలయం నుండి మనలను వేరు చేసుకుని/ విడదీసుకుని, వాస్తవిక తత్వమును ఎరింగి అత్యున్నతమైన సమస్థితిని (ఆనందము, సత్యమునకు ఆలవాలమైనటువంటి స్థితిని) అందుకొనుటకు ప్రయత్నించాలి.
భగవద్విశ్వాసమే మనలను దైవము యొక్క చరణముల వద్దకు చేర్చుతుంది. భగవాన్ బాబా వారు తమ అనంత కృపాకటాక్షములతో మార్గదర్శకులుగా దారి చూపుతున్నారు. భగవాన్ బాబా చెప్తారు మీరు శ్రద్ధతో ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే దానికి పర్యవసానంగా పది అడుగులు ఏర్పడతాయి అని. కార్యకారణ పరంపరయే పరివర్తన యొక్క ప్రక్రియ. ఎట్టి విత్తనమును నాటుతామో అట్టి ఫలమే విస్తారంగా కాలక్రమేణా మనకు లభ్యమవుతుంది. దేనినైతే నాటి పెంచి పోషిస్తామో దానినే ఫలముగా పొందుతాము. కనుక మనస్సనే సారవంతమైన క్షేత్రమందు సత్సంకల్పములను విత్తులను నాటాలి. సత్సాంగత్యము, సత్ గ్రంథ పఠనము, మంచి వాతావరణము దీనికి దోహదపడతాయి.
మంచి తలంపులు అనే రాయిని మన మానస సరోవరంలో వేసినప్పుడు, మంచి తలంపులు అనే అలలు అక్కడ ప్రారంభమై, దేహమంతా నఖశిఖ పర్యంతము వ్యాపించి (సమ్యక్) మంచి దృష్టిని, మంచి శ్రవణమును, మంచి వాక్కును, మంచి పనులను అందజేస్తాయి.
– శ్రీ సత్య సాయి (21/5/2000)
భగవద్విశ్వాసము మనః శుద్ధి పొందటానికి తోడ్పడుతుంది. జ్ఞానేంద్రియముల ద్వారా మంచినే గ్రహించినప్పుడు/ స్వీకరించినప్పుడు సబ్కాన్షియస్ మొత్తము మంచి భావములతో నిండిపోతుంది. అది ఎలా అంటే నిండా మురికి నీరు ఉన్నటువంటి గ్లాస్ ని మంచినీళ్ల కొళాయి కింద పెట్టినప్పుడు ఏ విధముగా మురికి నీరంతా మంచినీటితో నింపబడుతుందో, అదే విధముగా సద్భావములు చేర్చబడతాయి. అప్పుడు సత్ప్రవర్తన అనునది అప్రయత్నముగా సహజ స్వభావముగా మారుతుంది.
ఇంద్రియముల ద్వారా అనుభవించవలసిన స్వీకరించవలసిన విషయములను విచక్షణతో విచారించవలెను. కోరికలపై నియంత్రణ ద్వారా దీనిని సాధించవచ్చు.
పంచభూతములన్నిటి యందును దృష్టి అనేది మహాశక్తివంతమైనటువంటిది. ఈ దృష్టిని అనేక విధములుగా వ్యర్థము కావించుకుంటూ ఉన్నాము. కనుకనే మానవుడు ధరించినటువంటి దేహము క్రమక్రమేణా నశించిపోతూ వస్తుండాది. మనము చూచేటువంటి చూపులు, మనం అనుభవించేటువంటి ఆనందములు, దృశ్య కల్పితమైనటువంటి ప్రభావములు ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయుః ప్రమాణమును క్షీణింప చేస్తున్నాయి. దృష్టితో పాటు నాలుకను కూడా స్వాధీనములో ఉంచుకోవలెను. మనము రుచులకు మరిగి, అనేకమైనటువంటి రుచులకు అభ్యాసమైపోయి, అయిష్టమైనటువంటి పదములను ఉపయోగ పెడుతూ, ఇతరుల యొక్క హృదయాన్ని మనము బాధింప చేస్తున్నాము, కఠినమైనటువంటి పదములను ఉపయోగపెట్టి వారి హృదయములను గాయపరుస్తున్నాము.
– శ్రీ సత్య సాయి (5/7/2001)
ఇచ్ఛాశక్తి/ సంకల్ప బలము లేనిచో జీవితములో దేనినీ సాధించలేము. మార్పు/ పరివర్తన యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నప్పుడే, ఇచ్ఛాశక్తి కూడా శక్తివంతము/ దృఢంగా అవుతుంది. చంచలమైన మనస్సును స్థిరమైన/ అర్థవంతమైన కార్యాచరణ ద్వారా నియంత్రించవలెనన్న దృఢ సంకల్పము పెంపొందించుకొనవలెను. మంచినే చూచుటకు- మంచిగా ఉండుటకు – మంచినే చేయుటకు క్రమశిక్షణ ఎంతో అవసరము. ఆత్మ సంయమనము అలవర్చుకోవటానికి మనస్సును తగినంత శిక్షణకు గురిచేసి, అభివృద్ధి పరచుటకు క్రమశిక్షణ యొక్క ఆవశ్యకత ఎంతయో ఉంది. సత్కర్మలలో ప్రవేశించి, సదాభ్యాసములను అలవర్చుకుని, సద్గుణశీల సంపన్నులుగా మారవలెను/ తనను మలుచుకోవలెను. అప్పుడు నిర్ణీత సమయంలో మానవతా విలువలు మనస్సు నందు ముద్రింపబడతాయి. ఈ విధముగా చంచలమైన మనస్సు కుదుటపడి ప్రశాంతముగా/ నిశ్శబ్దముగా (ఆలోచన/ సంకల్ప రహితముగా) మారుతుంది. అప్పుడు అంతర్వాణిని స్పష్టంగా వినగలుగుతాము. ఉన్నతమైనటువంటి ఆత్మ, మనస్సును నియంత్రించి స్థిరమైన, నిలకడ అయిన కార్యాచరణను అందిస్తుంది. నిర్మలమైన మనస్సును సాధించినప్పుడు త్రికరణ శుద్ధిని పొందగలుగుతాము (మనోవాక్కర్మల ఏకత్వము).
దైవము పట్ల ప్రదర్శించే కృతజ్ఞతయే నిజమైన భక్తి. దైవము మనకు ఎన్నో ఇస్తాడు- సమర్థవంతమైనటువంటి దేహము, తెలివితేటలు, జ్ఞాన విజ్ఞానములు, గాలి -వెలుతురు- నీరు అన్ని సౌకర్యములను ప్రసాదిస్తాడు.
– శ్రీ సత్య సాయి (6/3/1987)
ఏతావాత సత్సంకల్పములు, సద్భావములకు దారితీస్తాయి. సద్భావములు సత్కార్యములగా ఆవిర్భవించి, సదాభ్యాసములను అలవరుస్తాయి. తద్వారా సద్గుణశీలము లభ్యమవుతుంది. మరియు స్థిరమైన మంచి నడవడిక అలవడుతుంది/ పొందుతాము.
కర్తవ్య పాలన – భౌతిక ప్రార్థన – భగవంతునికి ప్రేమ పూరిత సేవ. మానవ శరీరము అనునది భౌతిక ప్రపంచములో మనస్సు యొక్క కార్యమును సిద్ధింప చేయు సాధనము / ఉపకరణము. మరియు పాంచ భౌతికమైనది. మనస్సును నిర్మలము గావించుటకు, లోకములో సమస్థితిని సమతుల్యతను కాపాడుటకు ఉపయోగపడుతుంది. ఇది శరీరము యొక్క ఉద్దేశ్యము మరియు కర్తవ్యము. నిస్వార్థమైన సేవా కార్యక్రమములలో పాల్గొనేటట్లు చేస్తుంది. సేవ, తను శరీరమునన్న భావమును అధిగమింప చేసి ఉన్నత స్థాయికి, పరమావధికి చేరుస్తుంది.
అప్పుడు మనలోని దివ్యత్వమును కనుగొని, దివ్యమైన ప్రేమను, శాంతిని అందరికీ పంచగలుగుతాము.
ప్రేమ నుండి వెలువడు శక్తివంతమైన తరంగాలు ప్రపంచాన్ని మొత్తము శక్తివంతంగా చేస్తుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో సహాయపడుతుంది. మన సంకల్పములన్నీ దైవసంకల్పములుగా మారిపోతాయి.
మార్పు / పరివర్తన సంభవించినప్పుడు, లభ్యమైనప్పుడు, ఈ ప్రయాణము – తన నుండి తనలోని దివ్యత్వమునకు సలుపు ప్రయాణమని అవగతము అవుతుంది. దైవము నీ చుట్టూ, నీతో, నీలో, నీ ప్రక్కన అంతా వ్యాపించి ఉన్నాడు.
– శ్రీ సత్య సాయి
మానవజాతి అంతా ఒక్కటే. బాలవికాస్ విద్యార్థి అయినా, స్కూల్ విద్యార్థి అయినా, యువకుడైనా, వయస్కుడైనా, భారతీయుడైనా, పాశ్చాత్యుడైనా, శ్రీ సత్య సాయి ఎడ్యుకేర్ యొక్క లక్ష్యము ఒక్కటే. మామిడి బీజమును ప్రపంచంలో ఎక్కడ నాటినా, దాని నుండి మామిడి చెట్టే వస్తుంది. మామిడికాయలే కాస్తాయి. వాతావరణంలోని ప్రతికూల అనుకూల కారకాలు పండు యొక్క తీయదనమును, ఆకారమును మాత్రమే కొంతవరకు ప్రభావితం చేయవచ్చు. అదేవిధంగా శ్రీ సత్య సాయి ఎడ్యుకేర్ అవలంబించే విధానములు ఒక్కటే. వివిధ/ భిన్న సామాజిక, సాంస్కృతిక నేపథ్యముల వలన (బోధన) విషయములు/అంశములలో మార్పు/ తేడా ఉండవచ్చును. వ్యవహరించవలసిన విధానము, నివేదించవలసిన విధానంలో విధానంలో మార్పులు చేర్పులు చేయవలసి (వచ్చి) ఉండవచ్చు. భిన్న వయస్సుల వారికి (చిన్న పిల్లలు యువకులు, వయస్కులు) అందించు ఉదాహరణలు వేరుగా ఉంటాయి, ఉండాలి కూడా. కానీ లక్ష్యము మాత్రము ఒక్కటే. శ్రీ సత్య సాయి ఎడ్యుకేర్ విశ్వమంతా, సర్వత్రా వర్తింపచేయదగినది. ఇది మానవజాతికి అత్యంత, ఉన్నతమైన, హితమైన, శ్రేయస్కరమైన ఆధ్యాధ్యాత్మిక జ్ఞాన సంపద. “21వ శతాబ్దపు వేదము” అని చెప్పవచ్చు.
- మానవ జీవన మూలస్థానము/ మూలాధారమునకు జరుపు ప్రయాణమే పరివర్తన/ మార్పు.
- పరివర్తన సాధించే ప్రక్రియలో ముఖ్యమైన అంశము విశ్వాసము (భగవద్విశ్వాసము).
- మార్పు సాధించవలెనన్న అందుకు తోడ్పడు ముఖ్యమైన ఉపకరణములు- ఐదు అబ్యాసములు- డకార పంచకములు- భక్తి, నియమబద్ధత, కర్తవ్యము, విచక్షణ, దృఢ సంకల్పము.
- ఈ ప్రక్రియలో ప్రవేశపెట్టు ఐదు సాంకేతిక పద్ధతులు- ప్రార్థన, భక్తి సంబంధమైన బృందగానము, నిస్వార్థ సేవ, అంతర్ముఖము గావించుట, మంచి వాతావరణము