పూర్వకాలంలో, ప్రతి రాజ్యంలో దేవాలయాలు ప్రజల కార్యకలాపాలకు మరియు శ్రేయస్సుకు కేంద్రాలుగా ఉండేవి. వారు రాజ్యంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని కోటలుగా మరియు రక్షణ నిలయాలుగా ఉపయోగించేవారు. కొన్ని సందర్భాలలో దివత్వం మానవ రూపంలో అవతరించిన ప్రతి చోట దేవాలయాలు నిర్మించబడ్డాయి. అందువల్ల ఈ ప్రదేశాలు అధిక సానుకూల శక్తిని మరియు దివ్య ప్రకంపనాలను కలిగి ఉన్నాయి.
భారతదేశం యొక్క పొడవు మరియు వెడల్పులు పరిశీలిస్తే, మొత్తం అంతా ప్రసిద్ధ దేవాలయాలు మరియు ప్రార్థనాలయాలు వ్యాప్తి చెంది వున్నాయి. పాశ్చాత్య ప్రభావం మరియు “ఆధునీకరణ” ఎక్కువగా ఉన్న నేటి యుగంలో, ఈ దేవాలయాల వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం మరియు ఈ దేశ సంస్కృతిని నిర్మించడంలో ఎన్నో సంవత్సరాలుగా వారు పడిన కష్టాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరికీ చాలా అవసరము. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించేటప్పుడు, దేవాలయాల కథలను ఆయా ఆలయాలు మరియు దేవతల చిత్రాలతో వివరించవచ్చు.