భారతదేశం అనేక మంది సాధువులు మరియు ఋషులతో మానవ రూపంలో అవతరించిన దివత్వం తో పునీత మైనది. అందుకేభారతదేశం పుణ్యభూమి, అని స్వామి చెప్పారు. “ప్రపంచము అనబడే ఆధ్యాత్మిక రైలు”కు భారతదేశం ఇంజన్ కాగా, మిగిలిన దేశాలన్నీ రైలుకు జోడించిన పెట్టెల వంటివి. ఈ భూమిలో, సాధువులు. ఋషులు మరియు ఆధ్యాత్మిక ఆకాంక్ష కలిగిన వారు అందరూ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన సామీప్యాన్ని పొందగలిగారు. వారి ప్రార్థనలకు ప్రతిస్పందించి భగవంతుడు ఈ పుణ్యభూమిపై అవతరించి తన అనుగ్రహ ఆశీస్సులను అందిస్తున్నాడు. ప్రతి సాధువు, భక్తుడు తమదైన ప్రత్యేక మార్గంలో భగవంతుని పట్ల భక్తిని, ప్రేమను ప్రకటిస్తారు.
ఈ మహనీయుల జీవిత చరిత్రలు మరియు బోధనల గురించి విద్యార్థులు తెలుసుకోవడం చాలా అత్యవసరం. ప్రతి సాధువు, భక్తుడు భగవంతుని పట్ల చూపే భక్తి మరియు ప్రేమ వారి యొక్క స్వంత మార్గముగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఈ సాధువుల కథలను తరగతిలో వివరించవచ్చు మరియు మన నిత్య జీవితంలో భక్తి మార్గాన్ని ఎలా అవలంబించాలి అనేదానికి ఉదాహరణలుగా ఇవ్వవచ్చు.